నెరవేరని మిలియనీర్ కల.. ఆ పోటీ పరీక్షలో 27వ సారి ఫెయిల్..!
ఒకవైపు వ్యాపారంలో రాణిస్తూ.. మరోవైపు తాను కోరుకున్న విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ప్రయత్నించాడో మిలియనీర్(Chinese Millionaire). అయితే ఆయన ప్రయత్నాలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన స్టోరీ వైరల్గా మారింది.
బీజింగ్: వ్యాపారవేత్తగా విజయవంతంగా రాణిస్తూ.. ఓ పరీక్షలో మాత్రం వరుస డింకీలు కొడుతున్నారో మిలియనీర్. చైనా(China)కు చెందిన ఆయన 56 ఏళ్ల వయస్సులోనూ 27వ సారి పరీక్ష రాశారు. ఈ సారి కూడా ఆయన ఏళ్ల నాటి కల నెరవేరలేదు. ఇంతకీ విషయం ఏంటంటే..?
ఆ చైనా మిలియనీర్(Chinese Millionaire) పేరు లియాంగ్ షీ(Liang Shi). చైనా(China)లో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష ‘గావోకావో’(gaokao)లో ఉత్తీర్ణత సాధించి, ప్రతిష్ఠాత్మక సిచువాన్ విశ్వవిద్యాలయంలో చేరాలనేది ఆయన కల. కానీ అందుకోసం ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మన దగ్గర జేఈఈ మాదిరిగానే ఆ పోటీ పరీక్ష కూడా కఠినతరమైంది. ఇప్పటికి లియాంగ్ 27 సార్లు దానికి హాజరయ్యారు. కానీ ఈ సారి కూడా ఆయన ప్రయత్నం ఫలించలేదు. ‘ఈ పరీక్షలో ఉత్తీర్ణత కోసం గత కొంతకాలంగా ఎన్నో త్యాగాలు చేశాను. ఒక సన్యాసిలా జీవిస్తూ.. నా దృష్టి అంతా పరీక్ష మీదే పెట్టాను’ అని ఆయన వెల్లడించారు. అయినా అర్హత మార్కులకు 34 పాయింట్లు తగ్గడంతో లియాంగ్కు ఈసారీ నిరాశే ఎదురైంది.
ఫలితాలకు ముందే తనకు తగిన స్కోర్ రాదని లియాంగ్కు అనిపించిందట. తాను అనుకున్న విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ఎన్నిసార్లైన ప్రయత్నిస్తానని గట్టిగా చెప్పే ఆయన.. ఈసారి మాత్రం నమ్మకం కోల్పోయినట్లు కనిపించారు. ‘మెరుగవుతానని నమ్మకం లేనప్పుడు మళ్లీ మళ్లీ ప్రయత్నించడంలో అర్థం లేదు. వచ్చే ఏడాది ఈ పరీక్ష రాస్తానో లేదో చెప్పడం కష్టం. అయితే గావోకావోకు సిద్ధం కాకుండా ఉండే పరిస్థితిని నేను ఊహించలేను. అది నాకెంతో బాధకలిగించే విషయం’ అని లియాంగ్ వెల్లడించారు. అయితే ఆయన ప్రయత్నాలను కొందరు పబ్లిక్ స్టంట్ అని విమర్శించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ, వాటిని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన ఆయన.. ప్రస్తుతం కాస్త నిరాశలోకి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM