Pak Army: ‘పాకిస్థానీలు ఆ చిప్పను పక్కన పడేయాలి’.. దేశ ఆర్మీచీఫ్ వ్యాఖ్య
పాక్ యాచించడం మానేయాలని ఆర్మీ చీఫ్ అసీం మునీర్ పేర్కొన్నారు. ఓ వైపు చైనా నుంచి అదనపు రుణం కోసం యత్నిస్తున్న సమయంలో మునీర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని మానేయాలని ఆ దేశ ఆర్మీచీఫ్ జనరల్ ఆసిం మునీర్ హితబోధ చేశారు. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని పేర్కొన్నారు. ఆయన ఖానేవాల్ మోడల్ అగ్రికల్చర్ ఫామ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘ పాకిస్థానీలు ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు, గర్వించదగినవారు. పాక్ వాసులు కచ్చితంగా చిప్పను (బెగ్గర్స్ బౌల్) విసిరేయాలి’’ అని వ్యాఖ్యానించారు. అన్ని రకాల శక్తులను పాక్కు భగవంతుడు ఇచ్చాడని ఆసిం మునీర్ అన్నారు. తమ దేశ ప్రగతిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని తెలిపారు. దేశం, ప్రజల మధ్య తల్లీబిడ్డల బంధం ఉందని ఆయన వెల్లడించారు.
మాస్కోను వణికించిన ఉక్రెయిన్ డ్రోన్లు
ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడే వరకు పాక్ ఆర్మీ విశ్రమించదని మునీర్ స్పష్టం చేశారు. త్వరలోనే పాక్ ఓ వ్యవసాయ విప్లవాన్ని చూస్తుందని జోస్యం చెప్పారు. తాము దేశం మొత్తం మోడల్ ఫామ్లను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇవి చిన్న రైతులకు ఆధునిక సేద్యంలో సాయం చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయన్నారు.
పాకిస్థాన్ చైనా నుంచి మరో భారీ రుణం అందుకోవడానికి సిద్ధమైన సమయంలో ఆర్మీచీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇటీవల ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరో 600 మిలియన్ డాలర్ల రుణాన్ని పొందేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఒక్క జులై నెలలోనే పాక్ ప్రభుత్వం మొత్తం 2.44 బిలియన్ డాలర్ల మేరకు అప్పు చేసింది. వీటిల్లో చైనా నుంచి తెచ్చుకొన్న 2.07 బిలియన్ డాలర్లు కూడా ఉన్నాయి.
ఇటీవల ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ తన నివేదికలో పాక్ కష్టాలను వెల్లడించింది. పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక నిల్వల కొరత ప్రభావం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపైనే కాకుండా.. భవిష్యత్లో దేశ అవసరాలను తీర్చుకునేందుకు భయంకరమైన సవాల్ విసురుతుందని అభిప్రాయపడింది. తాజా ఆర్థిక సంవత్సరంలో అసలు, వడ్డీ కలిపి పాకిస్థాన్ 25 బిలియన్ డాలర్ల మేర చెల్లించాల్సి ఉంది. కానీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో చెల్లింపు ప్రక్రియ వాయిదా పడింది. రానున్న రోజుల్లో పాక్కు ఇది మరింత భారంగా తయారవుతుందని మూడీస్ వెల్లడించింది. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాకిస్థాన్ నడుచుకోవాలని మూడీస్ నొక్కి చెప్పింది. అయితే, పాకిస్థాన్లో రాబోయే ఎన్నికలు ముగిసిన తర్వాతనే ఆ దిశగా స్పష్టత వచ్చే అవకాశముందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి