Titanic Sub: ‘నాన్న సంతోషం కోసం వెళ్లి..’ టైటాన్లో ప్రాణాలు కోల్పోయి!
అట్లాంటిక్ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్ మినీ జలాంతర్గామిలో (Titan Submarine) పాకిస్థానీ బిలియనీర్ హెహ్జాదా దావూద్తోపాటు సులేమాన్ కూడా ఉన్నారు. సులేమాన్కు ఈ యాత్ర చేయడం ఇష్టం లేకున్నప్పటికీ.. తండ్రిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: అట్లాంటిక్ మహా సముద్రంలో విచ్ఛిన్నమైన టైటాన్ మినీ జలాంతర్గామిలో (Titan Submarine) ఓషన్గేట్ సంస్థ సీఈవో స్టాక్టన్ రష్తో పాటు మరో నలుగురు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అందులో పాకిస్థానీ బిలియనీర్ హెహ్జాదా దావూద్తో పాటు సులేమాన్ కూడా ఉన్నారు. సులేమాన్కు అసలు ఇటువంటి సాహస యాత్రలంటే భయమట. కేవలం తండ్రి అభీష్టం మేరకే ఈ టైటాన్లో వెళ్లి సముద్రగర్భంలో చనిపోయినట్లు అతడి సమీప బంధువులు వెల్లడించారు. ముఖ్యంగా ‘ఫాదర్స్ డే’ రోజున నాన్నను సంతోషపెట్టాలని భావించి.. చివరకు ప్రాణాలు కోల్పోవడాన్ని నమ్మలేకపోతున్నామని వాపోయారు.
పాకిస్థాన్ బిలియనీర్ షెహ్జాదా దావూద్ (48) కుమారుడు సులేమాన్ దావూద్ వయసు కేవలం 19ఏళ్లు. కెనడా నుంచి మొదలయ్యే ఈ ఓషన్గేట్ జలాంతర్గామి ప్రయాణానికి కొన్నిరోజుల ముందు ఈ యాత్రపై సులేమాన్ సంకోచించడంతో పాటు ఎంతో భయపడ్డాడట. ఈ విషయాన్ని షెహ్జాదా దావూద్ సోదరి అజ్మేష్.. అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. ‘టైటానిక్ శిథిలాల సందర్శనకు వెళ్లిన వాళ్లలో సులేమాన్ ఒక్కడే అతి చిన్న వయస్కుడు. మిగతా వాళ్లు వారి ఇష్టం మేరకు వెళ్లినప్పటికీ ఈ యువకుడు మాత్రం అలా జరగలేదు. సముద్రగర్భంలో యాత్ర చేసేందుకు సులేమాన్ సంకోచించాడు. అలా వెళ్లడానికి ఇష్టపడకపోగా.. చాలా భయపడ్డాడు. ఈ యాత్ర ‘ఫాదర్స్ డే’ రోజున జరుగుతున్నందున తన తండ్రిని సంతోషపెట్టాలని అనుకున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని దావూద్ సోదరి పేర్కొన్నారు. ఆ యాత్ర విషాదాంతమైందని తెలుసుకున్న ఆమె.. సులేమాన్ చనిపోయాడన్న వార్తను నమ్మలేకపోతున్నానని విలపించారు.
షెహ్జాదా దావూద్, అజ్మేష్ దావూద్లు పాకిస్థాన్లో ప్రముఖ కార్పొరేట్ కుటుంబానికి చెందిన వారు. వ్యవసాయం, ఆరోగ్యంతో పాటు ఇతర రంగాల్లో వీరి పెట్టుబడులున్నాయి. దావూద్ హెర్క్యూల్స్ కార్పొరేషన్తో పాటు మరిన్ని సంస్థలు వీరి సొంతం. ఇదిలాఉంటే వీరితో పాటు ప్రయాణించిన యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నావికా అధికారి పాల్ హెన్రీ, ఈ యాత్ర నిర్వాహకుడు, ఓషన్గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఈ జలాంతర్గామి ప్రమాదంలో మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి