Pak Election: ఎట్టకేలకు ముగిసిన ఓట్ల లెక్కింపు..! ఇమ్రాన్ ‘అభ్యర్థుల’దే పైచేయి
ఎట్టకేలకు పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్’ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాల (Pakistan Election Results)ను ఎన్నికల సంఘం (ECP) ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (PTI)’ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన ‘పీఎంఎల్-ఎన్’ పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన ‘పీపీపీ’కి 54 సీట్లు లభించగా, ‘ఎంక్యూఎం-పీ’ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.
ఇక్కడి జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే గురువారం ఎన్నికలు నిర్వహించారు. సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం 264 స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్లోని ‘ఎన్ఏ-88’ సీటు ఫలితాలను నిలిపేసింది. పంజాబ్, సింధ్, ఖైబర్-పఖ్తుంక్వా ప్రావిన్సుల అసెంబ్లీల ఫలితాలూ వెల్లడయ్యాయి. బలూచిస్థాన్లోని మూడు నియోజకవర్గాల ఫలితాలు పెండింగ్లో ఉన్నాయి.
ఎటూ తేలని పాక్ రాజకీయం.. ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. 265 స్థానాల్లో పార్టీ 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలోనే ‘పీపీపీ’తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ‘పీఎంఎల్-ఎన్’ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు కలిసి రావాలని ‘పీటీఐ’ మినహా మిగిలిన పక్షాలకు పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. వాటితో చర్చించే బాధ్యతను సోదరుడు షెహబాజ్ షరీఫ్కు అప్పగించారు. నవాజ్కు అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ కూడా రంగంలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!