Pakistan: పాకిస్థాన్లో 10 గ్రాములు బంగారం ఎంతో తెలుసా..?
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan) పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం 50 ఏళ్ల గరిష్ఠానికి చేరింది.
ఇస్లామాబాద్: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్(Pakistan)లో ద్రవ్యోల్బణం చుక్కల్ని తాకుతోంది. 50 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ 31.5 శాతానికి చేరిందని పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 280కి చేరింది. ఇక పదిగ్రాములు బంగారం (Gold) ధర అనూహ్యంగా పెరిగిపోయింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర 2.06 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరిందని అక్కడి మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. మరోవైపు, పాక్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది.
ద్రవ్యోల్బణ కారణాలను చూపుతూ గురువారం అక్కడి కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 300 బేసిస్ పాయింట్లు పెంచింది. దాంతో రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరింది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ (Pakistan) అప్పు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి (Imf) విధించిన షరతులకు ఇటీవలే తలొగ్గింది. బడ్జెట్ లోటును తగ్గించుకొని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా ఇటీవల మినీ బడ్జెట్ను ఆవిష్కరించింది. ఫారెక్స్ నిల్వలు సరిపడా లేకపోవడంతో అత్యవసర ఔషధాలు/ దేశంలో ఉత్పతి చేసే ఇతర మెడిసన్ ముడి సరకును సైతం దిగుమతి చేసేకోలేక పాక్ (Pakistan) విలవిలలాడుతోంది. దీంతో స్థానిక ఔషధ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆస్పత్రుల్లోని రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్రచికిత్సల్ని నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నిత్యావసరాల కోసం ప్రజలు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి మరణాలూ చోటుచేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పాలస్తీనా’ ప్రకటిస్తే ఆయుధాలు వీడటానికి సిద్ధం
కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్- హమాస్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ.. హమాస్ ఉన్నతస్థాయి రాజకీయ ప్రతినిధి ఖలీల్ అల్-హయ్యా కీలక ప్రతిపాదనలు చేశారు. -
మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. -
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
ఇటీవల మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికలపై భారత్ స్పందించింది. ఎన్నికలు విజయవంతమైనందుకు అభినందనలు తెలిపింది. -
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
ఒకప్పుడు భారం అనుకున్న బంగ్లాదేశ్ను చూసి సిగ్గుపడాల్సి వస్తోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.