WHO: ‘అలా జరిగితే ఈ ఏడాదిలో కొవిడ్ తీవ్ర దశ ముగుస్తుంది’
రెండేళ్లుగా కొత్త కొత్త వేరియంట్లతో కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ విజృంభణ తగ్గుముఖం పడుతుండగా.. కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల హెచ్చరించింది. అయితే, ప్రపంచ జనాభాలో...
కేప్ టౌన్: రెండేళ్లుగా కొత్త కొత్త వేరియంట్లతో కొవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒమిక్రాన్ విజృంభణ తగ్గుముఖం పడుతుండగా.. కరోనా వైరస్ ఇంకా ముగిసిపోలేదని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల హెచ్చరించింది. అయితే, ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే మహమ్మారి తీవ్రమైన దశ ఈ ఏడాదిలో ముగుస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తాజాగా వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న అధనామ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది జూన్, జూలై మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మందికి టీకాలు పూర్తయితే.. సంవత్సరాంతానికి మహమ్మారి తీవ్రమైన దశ ముగుస్తుందని అంచనా. మనం ఆశించేది ఇదే. అంతా మన చేతుల్లోనే ఉంది’ అని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు కేవలం 11 శాతం మందికి మాత్రమే కొవిడ్ టీకా పూర్తయింది. ఇది ప్రపంచంలోనే అత్యంత తక్కువ రేటు కావడం గమనార్హం. స్థానికంగా 70 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రస్తుత టీకాల వేగాన్ని ఆరు రెట్లు పెంచాల్సి ఉంటుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఈ క్రమంలోనే మోడెర్నా సీక్వెన్స్ను ఉపయోగించి ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ టీకాను రూపొందించిన ‘ఆఫ్రిజెన్ బయోలాజిక్స్, వ్యాక్సిన్’ కేంద్రాన్ని అధనామ్తోపాటు డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు సందర్శించారు. డబ్ల్యూహెచ్ఓ, కొవాక్స్ సహకారంతో ఆఫ్రిజెన్.. ఈ ప్రాజెక్టు చేపడుతోంది. 2024లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తక్కువ ధర, స్వల్ప జాగ్రత్తలతో నిల్వ చేయాల్సివచ్చే సందర్భాల్లో ఈ టీకా అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు అధనామ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.