Priyanka Chopra: వారి ఆవేదన విని.. కన్నీరు పెట్టుకున్న ప్రియాంక..!
ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దురాక్రమణ ఎన్నో విషాదాలను ప్రపంచం ముందు ఉంచింది. దాడుల బారినుంచి తప్పించుకునేందుకు మహిళలు, చిన్నారులు ప్రాణాలు అరచేతపట్టుకొని దేశం దాటారు.
వార్సా: ఉక్రెయిన్పై రష్యా జరుపుతోన్న దురాక్రమణ ఎన్నో విషాదాలను ప్రపంచం ముందు ఉంచింది. దాడుల బారినుంచి తప్పించుకునేందుకు మహిళలు, చిన్నారులు ప్రాణాలు అరచేతపట్టుకొని దేశం దాటారు. మరికొందరు సొంత దేశంలోనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పురుషులు యుద్ధభూమిలోనే పోరాడుతుండగా.. మిగిలిన కుటుంబ సభ్యులు సరిహద్దు దేశాల్లో శరణార్థులుగా మిగిలి, అయినవారిని కలుసుకోలేక కాలం వెళ్లదీస్తున్నారు. అలా పొలండ్లోని శరణార్థి శిబిరంలోని వారిని మనదేశానికి చెందిన ప్రముఖ నటి, యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా పరామర్శించారు. వారి కష్టాలు విని కన్నీరు పెట్టుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు.
తన పర్యటన సందర్భంగా ప్రియాంక.. శరణార్థ మహిళలతో మాట్లాడారు. చిన్నారులలో కలిసి సరదాగా గడిపారు. కొందరు చిన్నారులు తాము చేతితో చేసిన బొమ్మలను ఆమెకు ఇచ్చి ఆశ్చర్యపర్చారు. ఈ క్రమంలో దాదాపు ఆరునెలల కాలంగా శరణార్థులుగా వారు అనుభవిస్తోన్న ఆవేదన విని, ఉద్వేగానికి గురయ్యారు. స్వదేశంలోనే ఉండిపోయిన అయినవారిని కలుసుకోలేకపోతున్నామని వారు బాధపడుతుంటే.. ఆమె కన్నీరు ఆపుకోలేకపోయారు. ‘యుద్ధం కారణంగా కలిగిన గాయాలు కొన్ని మనకు వార్తల్లో కనిపించవు. కానీ యునిసెఫ్ మిషన్లో భాగంగా వార్సా(పొలండ్ రాజధాని) వెళ్లిన నాకు అవి స్పష్టంగా కనిపించాయి. మూడింట రెండొంతుల మంది చిన్నారులు తమ సొంత ప్రాంతాలను వీడారు. యుద్ధ భయంతో ఉక్రెయిన్ సరిహద్దులు వీడిన వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే. వారికి ఆసరాగా నిల్చేందుకు పలు శిబిరాలు ఏర్పాటయ్యాయి’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ క్లిష్ట సమయంలో అత్యవసర సేవల నిమిత్తం యునిసెఫ్ పొలండ్లో 11 బ్లూ డాట్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.