Ukraine war: 270 రోజుల్లో ఉక్రెయిన్పై 4,700 క్షిపణులు..!
యుద్ధం మొదలైన తొమ్మిది నెలల్లో తమ దేశంపై క్షిపణుల వర్షం కురిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. పలు శాంతి ప్రతిపాదనలను ఆయన వెల్లడించారు.
ఇంటర్నెట్డెస్క్: యుద్ధం మొదలైన తొమ్మిది నెలల్లో రష్యా దాదాపు వేలకొద్దీ క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగించింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనే స్వయంగా వెల్లడించారు. ఆయన ఆదివారం అంతర్జాతీయ సంస్థ లా ఫ్రాంకోఫోని సభ్యులతో మాట్లాడుతూ ‘‘ఈ రోజుతో యుద్ధం మొదలై 270 రోజులవుతుంది. రష్యా 4,700 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. వందల కొద్దీ ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమయ్యాయి. వేల మంది ప్రజలు మరణించారు. లక్షల మంది బలవంతంగా వలసపోయారు’’ అని వెల్లడించారు.
ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనలను కూడా జెలెన్స్కీ తెలిపారు. ‘‘ఉక్రెయిన్ చాలా స్పష్టంగా ఉంది. అందులోని ప్రతి అంశంపై బాగా కసరత్తు చేశాం. రేడియేషన్, అణు సురక్షిత, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఖైదీల విడుదల, ఐరాస నియమావళిని అమలు చేసి ఉక్రెయిన్ సార్వభౌమాధికారాన్ని తిరిగి కల్పించడం, బలగాలను ఉపసంహరించి ఉద్రిక్తతలను తగ్గించడం, న్యాయాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ హాని నివారించడం, యుద్ధానికి ముగింపు నిర్ణయించడం’’ వంటివి ఉన్నాయని వెల్లడించారు.
ఉక్రెయిన్లోని జపోరిజియా అణు కర్మాగారం లక్ష్యంగా మళ్లీ దాడులు మొదలయ్యాయి. శని, ఆదివారాల్లో ఈ కేంద్రానికి సమీపంలో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. రష్యా బలగాలే ఈ దాడులకు పాల్పడుతున్నాయని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ దేశంలోని పవర్ గ్రిడ్, ఇతర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు. దీనివల్ల శీతాకాలంలో చాలా ఇబ్బందులు తలెత్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.