ISS: అమెరికా వ్యోమగామిని అంతరిక్షంలో వదిలేయం..: రష్యా
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలతో ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష
ఇంటర్నెట్డెస్క్: ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలతో ముప్పేట దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతరిక్ష రంగంలో తమ సహకారాన్ని నిలిపివేస్తామని రష్యా అంతరిక్ష సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో అమెరికా, రష్యా మధ్య అంతరిక్ష పరంగానూ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఐఎస్ఎస్ నిర్వహణలో అమెరికా, రష్యాలు కీలక పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.
అయితే ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న అమెరికా వ్యోమగామి మార్క్ వాండె హెయ్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఆయన రష్యా వ్యోమనౌకలో భూమికి తిరిగి రావాల్సి ఉండటమే ఇందుకు కారణం. అయితే అమెరికా, రష్యా మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో ఈ యాత్రపై ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో.. తమ దేశంపై విధించిన ఆంక్షలకు ప్రత్యక్ష ప్రతిస్పందనగా.. ఐఎస్ఎస్ నుంచి రావాల్సిన అమెరికా వ్యోమగామిని అక్కడే వదిలేస్తామని రష్యా బెదిరింపులకు పాల్పడుతోందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ వార్తలను రష్యా అంతరిక్ష సంస్థ కొట్టిపారేసింది. నిర్దేశించిన ప్రణాళిక ప్రకారమే.. అమెరికా వ్యోమగామిని భూమిపైకి సురక్షితంగా తీసుకువస్తామని ‘రోస్కాస్మోస్’ వెల్లడించింది. మరోవైపు మార్క్ ప్రయాణాన్ని వాయిదా వేయడంలేదని అటు నాసా కూడా పేర్కొంది.
మార్క్ వాండె.. ఏప్రిల్ 2021 నుంచి ఐఎస్ఎస్లో ఉంటున్నారు. ఏకబిగిన 340 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపిన అమెరికన్గా ఆయన మంగళవారం రికార్డు సృష్టించనున్నారు. ఈ నెల 30న ఆయన రష్యాకు చెందిన సోయజ్ వ్యోమనౌకలో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అప్పటికి ఆయన 355 రోజుల పాటు భూ కక్ష్యలో గడిపినట్లవుతుంది. ఈ అంశంలో ప్రపంచ రికార్డు (438 రోజులు) రష్యా పేరిట ఉంది. మార్క్ వాండె.. కజకిస్థాన్లో దిగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.