Ukraine crisis: రష్యా సైనిక చర్య.. ‘దాడి’ కాదు: చైనా
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ‘దాడి’ అని పిలవడానికి చైనా నిరాకరించింది. ఆ పదం వాడటం పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆక్షేపించింది.
బీజింగ్: ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ‘దాడి’ అని పిలవడానికి చైనా నిరాకరించింది. ఆ పదం వాడటం పక్షపాత వైఖరికి నిదర్శనమని ఆక్షేపించింది. తూర్పు ఉక్రెయిన్లో ప్రజలను కాపాడేందుకు సైనిక చర్యను చేపడుతున్నట్లు గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దాంతో ఇరుదేశాల మధ్య సైనిక పోరు కొనసాగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. కాగా, ఈ పరిణామాలపై చైనా మిత్రదేశం రష్యాను వెనకేసుకొచ్చింది.
‘చైనా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇరువర్గాలు సంయమనం పాటించాలి. పరిస్థితులు మరింత దిగజారకుండా నిరోధించాలి’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ అన్నారు. కాగా, బీజింగ్ ఈ చర్యలను ఖండిస్తుందా..? అని చునియింగ్కు మీడియా సమావేశంలో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అలాగే ఉక్రెయిన్పై రష్యా చేపడుతున్న సైనికచర్యను ‘దాడి’ అని సంబోధించేందుకు చైనా నిరాకరించింది. ఆ పదం వాడటం పక్షపాత వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఈ సైనిక పోరు వేళ.. ఉక్రెయిన్ లేక రష్యా నేతలను చైనా సంప్రదించిందా..? అని అడగ్గా.. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
కాగా, ఉక్రెయిన్ సంక్షోభానికి చారిత్రక నేపథ్యంతో పాటు ఇతర కారణాలున్నాయంటూ చైనా స్పందించింది. అంతేగాకుండా ఈ వివాదాన్ని పాశ్చాత్య దేశాలు పెద్దది చేసి చూపించినందుకు నిందలు వేసింది. ఈ వివాదంపై చైనా ఇప్పటికే అమెరికా తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఆ దేశం అగ్నికి ఆజ్యం పోస్తోందని మండిపడింది. ఫిబ్రవరి 16న రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తుందని అమెరికా నుంచి ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలకు విరుద్ధంగా రష్యా వెనక్కి తగ్గినట్లే కనిపించినా, అనూహ్యంగా గురువారం యుద్ధం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే