Taliban: ప్రిన్స్ హ్యారీ పరాజితుడు... తాలిబన్ ప్రతినిధి విమర్శలు..!
అఫ్గాన్ యుద్ధంలో 25 మందిని చంపినట్లు ప్రిన్స్ హ్యారీ చెప్పుకోవడాన్ని తాలిబన్లు తప్పుపట్టారు. అతడు పిరికి వాడని అభివర్ణించారు.
ఇంటర్నెట్డెస్క్: అఫ్గాన్(Afghanistan) యుద్ధంలో 25 మందిని హతమార్చినట్లు బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ (Prince Harry)చెప్పుకోడాన్ని తాలిబన్లు ఎగతాళి చేశారు. తాలిబన్ కమాండర్ మౌల్వీ అఘా గోల్ ఎద్దేవా చేశారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి గొప్పలు చెప్పుకొంటున్నాడన్నారు. ‘‘అతడు ముజాహిద్దీన్ల గురించి చెప్పివేవీ నమ్మబుద్ధి కావడంలేదు. అతడు పరాజితుడు. యుద్ధ క్షేత్రానికి వెళ్లడానికి కూడా భయపడ్డాడు. మేము అతడిని, అతడి సైన్యాన్ని మా మాతృభూమి నుంచి తరిమికొట్టి చరిత్ర సృష్టించాము. అందుకే అతడికి మాపై కోపం ఉంది. చనిపోయిన మా ముజాహిద్దీన్లు స్వర్గంలో ఉన్నారు. కానీ, దురాక్రమణ మిత్రులు నరకంలో కాలిపోతున్నారు. అతడు హెల్మాండ్లో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజమైన చదరంగపు పావులు ఎలా ఉంటాయో చూపించాము’’ అని మౌల్వీ అఘా గోల్ పేర్కొన్నారు.
ప్రిన్స్ హ్యారీ(Prince Harry) తన జీవితంపై ‘స్పేర్’ పేరిట ఆత్మకథ రాసుకొన్నారు. బ్రిటన్ సైన్యంలో పనిచేస్తున్న సమయంలో అఫ్గానిస్థాన్(Afghanistan)లో తాలిబన్లను వేటాడుతూ రెండు డజన్ల మందిని చంపినట్లు అందులో తెలిపారు. తాలిబన్లను సాధారణ పౌరులుగా చూడొద్దని బ్రిటన్ సైన్యం తనకు చెప్పిందని వివరించారు. తాను అంత మందిని చంపినందుకు గర్వపడటం గానీ, బాధపడటంలేదన్నారు. అపాచీ హెలికాప్టర్ పైలట్గా ఉన్న సమయంలో హ్యారీ ఈ దాడి చేసినట్లు పేర్కొన్నారు.
2007-08 మధ్యలో ప్రిన్స్ హ్యారీ (Prince Harry)అఫ్గానిస్థాన్(Afghanistan)లో బ్రిటిష్ రాయల్ ఆర్మీలో ఫార్వర్డ్ ఎయిర్ కంట్రోలర్గా పనిచేశారు. ఆ తర్వాత 2012-13 మధ్యలో అటాక్ హెలికాప్టర్ పైలట్గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు ఆపరేషన్లలో హ్యారీ పాల్గొన్నారు. తాము పోరాడుతున్న తాలిబన్లు కేవలం చదరంగంలో పావులే అని సైన్యం తనకు నూరిపోసిందని వివరించారు. ఈ పుస్తకంలో హ్యారీ వెల్లడించే విషయాల కారణంగా అతడి భద్రత ముప్పులో పడుతుందని బ్రిటన్ సైనిక నిపుణులు విమర్శించారు.
హక్కానీ గ్రూప్నకు చెందిన అనస్ హక్కానీ కూడా హ్యారీ పుస్తకంపై స్పందించాడు. ‘‘నువ్వు నిజం చెప్పావు. మీ సైన్యం, రాజకీయ నాయకులకు మా అమాయకపు ప్రజలు చదరంగంలో పావులు. ఆ చదరంగంలో మీరు ఓడిపోయారు. మానవ హక్కుల అంశంపై అంతర్జాతీయ న్యాయస్థానం మిమ్మల్ని ప్రశ్నిస్తుందని నేను ఆశించను.ఏ మానవహక్కుల కార్యకర్త దీనిని ఖండించరు. ఈ అకృత్యాలు చరిత్రలో నిలిచిపోతాయనుకుంటున్నాను’’ అని హక్కానీ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.