Smartphone: మీ ఫోనే ఇక థర్మా మీటర్.. కొత్త యాప్ వస్తోంది!
మనిషి శరీర ఉష్ణోగ్రతలను కొలిచేందుకు కొత్తగా ఓ మొబైల్ యాప్ను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది.
Image source: university of washington
ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఫోన్ కాల్స్కే పరిమితమైన ఫోన్.. ఇప్పుడు మనం నిత్యం వాడే ఎన్నో గ్యాడ్జెట్స్ను రీప్లేస్ చేసేసింది. ఇప్పుడు వాచ్ చూడాలన్నా స్మార్ట్ఫోనే.. అలారమ్ మోగాలన్నా స్మార్ట్ఫోనే.. వినోదం కావాలన్నా స్మార్ట్ఫోన్నే చూడాల్సిన పరిస్థితి. త్వరలో ఈ స్మార్ట్ఫోన్ (Smartphone) జ్వరాన్ని కొలిచేందుకు ఉపయోగించే థర్మామీటర్ (thermometer) అవతారాన్నీ ఎత్తనుంది. దీనికి సంబంధించి ఓ యాప్ రూపుదిద్దుకుంటోంది.
యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు ఫీవర్ యాప్ (Fever app) పేరిట ఓ యాప్ను రూపొందించే పనిలో పడ్డారు. స్మార్ట్ఫోన్లోని టచ్స్క్రీన్, బ్యాటరీ ఉష్ణోగ్రత కొలిచేందుకు ఉపయోగించే సెన్సర్ల సాయంతో మనిషి శరీర ఉష్ణోగ్రతను కొలిచి మెషిన్ లెర్నింగ్ సాయంతో ఆ వివరాలను వెలువరించానున్నారు. ఇందుకోసం అదనంగా ఎలాంటి హార్డ్వేర్ సహకారమూ అవసరం లేదని పరిశోధకులు చెప్తున్నారు. జన బాహుళ్యంలోకి తీసుకురావాలంటే మరింత విస్తృత డేటా అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ యాప్ను ఉపయోగించాలంటే అవతలి వ్యక్తి కనీసం స్మార్ట్ఫోన్ను కూడా తాకనవసరం లేదు. యాప్ను ఓపెన్ చేసి కెమెరా లెన్స్తో రోగి నుదుటిపై 90 సెకన్ల పాటు ఉంచితే సరిపోతుంది. ఈ యాప్ను 37 మంది రోగులపై ప్రయోగించినప్పుడు ప్రాథమిక దశలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. థర్మామీటర్తో పోలిస్తే సగటున 0.23 డిగ్రీల సెల్సియస్ ఎర్రర్ చూపిస్తోందని తెలిపారు. ఇది క్లినికల్గా ఆమోదించిన రేంజ్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. కావాల్సిన మెడికల్ క్లియరెన్సులన్నీ పూర్తయితే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ