USA: ఆస్ట్రేలియాలో కూలిన అమెరికా సైనిక హెలికాప్టర్.. ముగ్గురు మృతి
అమెరికా నేవీకి చెందిన విమానం ఒకటి ఆస్ట్రేలియాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 20 మంది గాయపడ్డారు. మరో ఘటనలో ఉక్రెయిన్లో రెండు శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియా(Australia)లో జరుగుతున్న యుద్ధ విన్యాసాల్లో అమెరికా(USA)కు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మెరైన్స్ మరణించగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాకు చెందిన ఎంవీ-22బీ ఓస్ప్రే ( MV-22B Osprey) హెలికాప్టర్ దాదాపు 23 మందితో ఆస్ట్రేలియాలోని ఉత్తర డార్విన్ ప్రాంతంలోని తివి ద్వీపం వద్ద వెళుతుండగా కూలిపోయింది. ఈ ఘటన మాల్విల్ ద్వీపం వద్ద చోటు చేసుకొంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ‘ప్రిడేటర్ రన్’ పేరిట యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఫిలిప్పీన్స్, ఈస్ట్ తైమూర్, ఇండోనేషియాకు చెందిన 2,500 సైనికులు దీనిలో పాల్గొన్నారు. ‘‘ఈ విమానంలోని మెరైన్లు యుద్ధ విన్యాసాల పనుల కోసం వెళుతున్నారు. ప్రస్తుతం శకలాలను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి కారణాలను గుర్తించేపనిలో ఉన్నాం’’ అని డార్విన్ రొటేషనల్ ఫోర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఆదివారం ఉదయం అమెరికా మెరైన్ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే హెలికాప్టర్లు డార్విన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం హెలికాప్టర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురయ్యాయి. 2022లో ఈ రకం హెలికాప్టర్ కూలి ఐదుగురు మెరైన్స్ చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా రెండు కూలిపోయాయి. 2000వ సంవత్సరం నుంచి దాదాపు 11 హెలికాప్టర్లు కూలిపోయాయి.
రెండు విమానాలు విమానాలు ఢీకొని..
ఉక్రెయిన్కు అందించనున్న ఎఫ్-16 యుద్ధ విమానాల కోసం పైలట్లకు ఇస్తున్న శిక్షణలో అపశ్రుతి చోటు చేసుకొంది. రెండు శిక్షణ విమానాలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఉక్రెయిన్ ఏస్ పైలట్ ఆండ్రీ పిల్షికోవ్ కూడా ఉన్నాడు. ఉత్తర ఉక్రెయిన్లో ఎల్-39 యుద్ధ విమానాలపై శిక్షణ కార్యక్రమం జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఆండ్రీ మృతి ఉక్రెయిన్కు తీరని లోటని ఆ దేశ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
విధేయత ప్రకటిస్తారా.. జైల్లోకి వెళతారా!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ముగ్గురి మరణాన్ని ధ్రువీకరించారు. కీవ్కు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది. విమానాలు గాల్లోకి ఎగిరేందుకు అవసరమైన నిబంధనలు సరిగ్గా పాటించలేదనే అనుమానాలున్నాయి. తాజాగా జరిగిన ప్రమాదం ఉక్రెయిన్ పైలట్లకు ఎఫ్-16ల శిక్షణలో మరిన్ని సమస్యలను సృష్టించనుంది. ఉక్రెయిన్ పైలట్లకు ఇంగ్లిష్ భాషలో శిక్షణను సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టినున్నట్లు గురువారం పెంటగాన్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్