Rishi Sunak: రిషి సునాక్కు షాక్.. తొలి ‘ఎన్నికల పరీక్ష’లో ఓటమి..!
బ్రిటన్ (Britain) స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోర ఓటమి దిశగా సాగుతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఫలితాలు కీలకంగా మారాయి.
లండన్: అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటున్న బ్రిటన్ (Britain) ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల పోరులో ఆయన ఓటమిపాలయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) ఘోర పరాజయం దిశగా ఉంది.
యూకే (UK) వ్యాప్తంగా 230 జిల్లాల్లోని 8వేలకు పైగా కౌన్సిల్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి లెక్కింపు మొదలుపెట్టారు. ఇప్పటివరకు 65 జిల్లాల్లోని కౌన్సిల్ స్థానాలకు ఫలితాలను వెల్లడించగా.. అందులో ప్రతిపక్ష లేబర్ పార్టీ (Labour Party) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే అధికార కన్జర్వేటివ్ పార్టీ ఇప్పటికే దాదాపు 250 స్థానాలకు కోల్పోయింది. ఇక మరో ప్రతిపక్ష పార్టీ లిబరల్ డెమోక్రాటిక్ (Liberal Democrats) కూడా మెరుగైన స్థానాలను దక్కించుకుంది. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే.. కన్జర్వేటివ్ పార్టీ (Conservative Party) ఇప్పటికే 10 జిల్లాల్లో పట్టు కోల్పోయింది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ.. ఫలితాల సరళిని చూస్తుంటే అధికార పార్టీకి ఘోర పరాజయం దిశగా సాగుతున్నట్లే కన్పిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఈ స్థాయిలో ఘోర వైఫల్యాన్ని చవిచూడటం 1990ల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. అంతేగాక, రిషి సునాక్ (Rishi Sunak) నాయకత్వంలో టోరీలు (కన్జర్వేటివ్ పార్టీ) ఎదుర్కొన్న తొలి ప్రధాన ఎన్నికలివే. 2024 చివర్లో సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్గా భావించే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సునాక్ పార్టీ ఓటమి పాలవ్వడం.. టోరీలను కలవరపెడుతోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలతో రిషి పాలనపై ప్రజల్లో కొంత ప్రతికూలత మొదలైంది.
తాజా ఫలితాలపై ప్రధాని సునాక్ (Rishi Sunak) స్పందిస్తూ ఓటమిని అంగీకరించారు. ఇలాంటి ఫలితం టోరీలకు అంత మంచిది కాదని అన్నారు. మరోవైపు వీటిపై లేబర్ పార్టీ నేతలు మాట్లాడుతూ.. ‘‘టోరీల వైఫల్యానికి ప్రజలు తగిన శిక్ష వేశారు. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ