Ukraine Crisis: యుద్ధ సంక్షోభం.. ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫోన్
ఒకవైపు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ప్రతిఘటిస్తూనే.. సైనిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయా దేశాల మద్దతు కోరుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ క్రమంలోనే శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రష్యా దూకుడును...
కీవ్: ఒకవైపు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ప్రతిఘటిస్తూనే.. సైనిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయా దేశాల మద్దతు కోరుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ క్రమంలోనే శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు జెలెన్స్కీ ట్విటర్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా రష్యా దూకుడును కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు చెప్పారు. ‘రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతున్న తీరును భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లా. లక్ష కంటే ఎక్కువ మంది రష్యా సైనికులు ప్రస్తుతం మా దేశంలో ఉన్నారు. వారు నివాస భవనాలపై కాల్పులు జరుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఐరాస భద్రతామండలి మాకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్కు విజ్ఞప్తి చేశా’ అని జెలెన్స్కీ ట్వీట్ చేశారు.
ఉక్రెయిన్పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ నేడు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జెలెన్ స్కీ.. ప్రధాని మోదీతో సంభాషించడం గమనార్హం. మరోవైపు.. సైనిక చర్యలో భాగంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి క్రెమ్లిన్ చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకున్నట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ‘రష్యన్ సేనల ప్రణాళికను మేం విఫలం చేశాం. కీవ్ ఇప్పటికీ ఉక్రెయిన్ ఆర్మీ నియంత్రణలోనే ఉంది. దాని చుట్టూ ఉన్న ప్రధాన నగరాలు కూడా మాతోనే ఉన్నాయి’ అని తాజాగా వీడియో సందేశం విడుదల చేశారు. దీంతోపాటు స్విట్జర్లాండ్, గ్రీస్, ఫ్రాన్స్ తదితర దేశాల నేతలు ఫోన్లు చేసి తనకు మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. అంతేగాకుండా స్విఫ్ట్ నుంచి రష్యాను డిస్కనెక్ట్ చేసేందుకు ఈయూ దేశాల నుంచి పూర్తి మద్దతు లభించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.