Ukraine Crisis: వీసా ఉంటేనే రష్యా పౌరులకు అనుమతి.. జెలెన్స్కీ కీలక నిర్ణయం
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు..........
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీసాలు ఉంటేనే రష్యా పౌరులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు ప్రకటించారు. జులై 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని టెలిగ్రామ్ వేదికగా వెల్లడించారు. రష్యా, ఉక్రెయిన్ పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే ఇరు దేశాలకు వెళ్లేవారు. అయితే ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాలుగు నెలలుగా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా చొరబాటును నిలువరించేలా ఆ దేశ పౌరులకు జెలెన్స్కీ వీసా విధానాన్ని ప్రకటించారు. 1991లో సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్య్రం పొందిన తర్వాత నుంచి కొనసాగుతున్న రష్యన్ పౌరుల వీసా రహిత రాకపోకలకు ఈ చర్య ముగింపు పలకనుంది.
మరోవైపు తమ 27 దేశాల కూటమిలో చేరేలా దరఖాస్తు చేసుకునేందుకు ఉక్రెయిన్కు అవకాశం ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ కార్యనిర్వాహక విభాగం సిఫారసు చేసింది. ఇది ఉక్రెయిన్కు ఊరటనిచ్చే విషయమే అయినప్పటికీ.. ఈ అధికార ప్రక్రియ పూర్తికావడానికి ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్ దరఖాస్తుకు ఈయూ కూటమిలోని అన్ని దేశాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈయూ సిఫారసులపై అవగాహన ఉన్నప్పటికీ వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.