Honeymoon: హనీమూన్ జంటను సముద్రంలో వదిలేసిన పడవ.. రూ.40కోట్లకు దావా
హనీమూన్లో (Honeymoon) భాగంగా సముద్రంలో ఈతకు వెళ్లిన ఓ జంటకు చేదు అనుభవం ఎదురయ్యింది. స్నొర్కెలింగ్ తీసుకెళ్లిన పడవ.. ఆ జంటను మధ్యలోనే వదిలివేసింది. దీంతో భయంతో ఒడ్డువరకూ ఈదుకుంటూ వచ్చిన ఆ జంట.. ట్రావెల్ ఏజెన్సీపై కోర్టులో దావా వేసింది.
వాషింగ్టన్: కొత్తగా పెళ్లైన జంట తమ హనీమూన్ను (Honeymoon) మధుర జ్ఞాపకాలతో నింపేయాలని అనుకున్నారు. ఇందుకోసం ఓ పర్యాటక ఏజెన్సీని సంప్రదించి హవాయి దీవులకు టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త జంటను అక్కడికి తీసుకెళ్లిన ఆ ఏజెన్సీ, తీరా.. సముద్రం మధ్యలోనే వదిలేసి రావడం గమనార్హం. దీంతో ఆ నవదంపతులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అయితే, తమ ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ ఏజెన్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ కపుల్.. తమకు పరిహారం చెల్లించాలంటూ తాజాగా కోర్టును ఆశ్రయించినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
కాలిఫోర్నియాకు చెందిన ఎలిజబెత్ వెబ్స్టెర్, అలెగ్జాండర్ బర్కల్లు.. 2021లో పెళ్లి చేసుకున్నారు. హనీమూన్లో భాగంగా అక్కడి హవాయి (Hawaii) దీవుల్లోని లనాయ్ (Lanai) ప్రాంతానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. ఇందుకోసం ‘సెయిల్ మౌయీ’ అనే పర్యాటక ఏజెన్సీని సంప్రదించారు. సెప్టెంబర్ 2021లో టూర్కు వెళ్లారు. అందులో భాగంగా.. డైవింగ్ మాస్కులు, స్విమ్ సూట్ ధరించి సముద్ర గర్భంలో ‘స్నొర్కెలింగ్’కు (Snorkelling) బయలుదేరారు. సుమారు 44 మంది పర్యాటకులను తీసుకెళ్లిన పడవ.. ఓ చోట నిలిపింది. ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పిన బోట్ కెప్టెన్.. ఎక్కడకు, ఎంత సమయంలోపు తిరిగి రావాలో మాత్రం స్పష్టంగా చెప్పలేదట.
అలా ఓ గంటసేపు నీటిలో గడిపిన ఆ దంపతులు.. సముద్రం అస్థిరంగా మారుతున్నట్లు గమనించారు. దీంతో 15 నిమిషాలపాటు ఈదుకుంటూ పడవ దగ్గరకు చేరుకునేందుకు యత్నించగా.. పడవ మరింత దూరం వెళ్తుండటాన్ని గుర్తించారు. దాన్ని అందుకునేందుకు యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో ఆ జంట ప్రాణాలకు తెగించి ఒడ్డు వరకూ ఈదుకుంటూ వచ్చింది. మధ్యలో అలసిపోయిన, సత్తువ కోల్పోయిన తమకు ఐలాండ్లో నివసించే ఓ వ్యక్తి సహాయం చేసినట్లు తెలిపింది. ఇలా తమకు ఎంతో మానసిక వేదన, భయభ్రాంతులకు గురిచేసిన ఆ ఘటనకు కారణమైన టూర్ ఏజెన్సీపై చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న అక్కడి కోర్టులో దావా వేసింది. ఏజెన్సీ నిర్వహణ లోపం వల్లే ఆ ఘటన జరిగిందని.. తమ ప్రాణాలకు ముప్పు కలిగిందని, పరిహారంగా ఈ ట్రావెల్ ఏజెన్సీ 5మిలియన్ డాలర్లు (సుమారు రూ.40కోట్లు) చెల్లించాలని డిమాండు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే