Nuclear Suppliers Group: ఎన్ఎస్జీలో సభ్యత్వం.. భారత్కు అమెరికా మద్దతు
న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో (NSG) భారత్ సభ్యత్వానికి మద్దతిస్తామని అమెరికా ప్రకటించింది. భావసారూప్య భాగస్వాములతో ఈ విషయంలో కలిసి వెళ్తామని పేర్కొంది.
వాషింగ్టన్: అణు సరఫరాదారుల సమూహం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్-NSG)లో భారత్ చేరేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా (USA) పునరుద్ఘాటించింది. ఈ విషయంలో భావసారూప్యత కలిగిన భాగస్వాములతో కలిసి వెళ్లేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత అమెరికా తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశం అనంతరం ఇరుదేశాలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే కర్బన ఉద్ఘారాలను తగ్గించే ప్రయత్నాల్లో అణుశక్తి పోషించే ముఖ్యపాత్రను నొక్కి చెప్పారు. అంతేకాకుండా భవిష్యత్లో ఇంధన అవసరాలను పరిష్కరించేందుకు, వాతావరణాన్ని పరిరక్షించుకునేందుకు అణుశక్తిని ఓ వనరుగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు ప్రాజెక్టు కోసం టెక్నో-కమర్షియల్ ఆఫర్ను అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన వెస్టింగ్హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీకి అవకాశాలను సులభతరం చేసేందుకు ఇరు దేశాలు స్వాగతించాయి. అంతేకాకుండా ఈ విషయంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ (యూఎస్ డీఓఈ), భారత్లోని అణుశక్తి విభాగం(DAE) మధ్య సంప్రదింపులను ఇరుదేశాల నేతలు అభినందించారు. రానున్న కాలంలో దేశీయ వినియోగం, ఎగుమతి కోసం సహకార పద్ధతిలో చిన్న తరహా అణు రియాక్టర్ టెక్నాలజీ అభివృద్ధి అంశాన్ని కూడా గుర్తించినట్లు మోదీ, బైడెన్ తమ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అణుసరఫరాదారుల సమూహంలో భారత్కు తన మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
అసలేంటీ ఎన్ఎస్జీ?
అణుశక్తిని సరఫరా చేసే దేశాల సమూహమే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ (NSG). ఇది అణు సంబంధిత ఎగుమతుల కోసం మార్గదర్శకాలను అమలు చేయడం ద్వారా అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి దోహదం చేస్తుంది. 1974లో దీనిని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్జీ మార్గదర్శకాలు వివిధ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతం ఎన్ఎస్జీలో అమెరికా, చైనా, రష్యా, ఉక్రెయిన్, మెక్సికో, అర్జెంటీనా, సైప్రస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇటలీ, నార్వే తదితర 48 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఎన్ఎస్జీ కూటమిలో భాగస్వామ్యం కోసం భారత్ ప్రయత్నించింది. చైనా వ్యతిరేకించడంతో ఈ ప్రక్రియలో ముందడుగుపడలేదు. మరోవైపు భారత్ సభ్యత్వాన్ని న్యూజిలాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి