India- Nepal: హిట్ నుంచి సూపర్ హిట్కు..! నేపాల్తో సంబంధాలపై ప్రధాని మోదీ
భారత్, నేపాల్ల మధ్య భాగస్వామ్యం ‘హిట్’ అయిందని, భవిష్యత్తులో దీన్ని ‘సూపర్ హిట్’ చేసే దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్తో గురువారం ప్రధాని మోదీ చర్చలు జరిపారు.
దిల్లీ: భారత్, నేపాల్ల మధ్య సంబంధాల (India- Nepal Ties)ను హిమాలయాలంతా ఉన్నతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. సరిహద్దు సమస్యలతోసహా అనేక అంశాల పరిష్కారానికి ప్రయత్నిస్తామని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ‘ప్రచండ’ (Pushpa Kamal Dahal)తో గురువారం ప్రధాని మోదీ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ‘హిట్’ అయిందని, భవిష్యత్తులో దీన్ని ‘సూపర్ హిట్’ చేసే దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
వాణిజ్యం, రవాణా, పెట్టుబడులు, విద్యుత్, నీటిపారుదల, పెట్రోలియం పైపులైన్ విస్తరణ, అనుసంధానత వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకునే మార్గాలపై చర్చించినట్లు ఇరు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా, పెట్రోలియం పైపులైన్ విస్తరణ, సమీకృత చెక్పోస్టుల అభివృద్ధి, జలవిద్యుత్ తదితర రంగాల్లో ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్లోని రూపయిడిహా, నేపాల్లోని నేపాల్గంజ్లో సమీకృత చెక్పోస్టులను వర్చువల్గా ప్రారంభించారు. బిహార్లోని బథ్నాహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు ఓ సరకు రవాణా రైలుకు పచ్చజెండా ఊపారు.
‘2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో నేపాల్లో పర్యటించా. ఆ సమయంలో ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో ‘హిట్ (హైవేస్, ఐ-వేస్, ట్రాన్స్-వేస్)’ ఫార్ములా ఇచ్చా. మా భాగస్వామ్యం ‘హిట్’ అయిందని చెప్పేందుకు గర్వపడుతున్నా’ అని మోదీ అన్నారు. సాంస్కృతిక, మతపర అనుబంధాన్ని మరింత పెంపొందించేందుకుగానూ.. రామాయణ సర్క్యూట్కు సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. భారత్ అవలంబిస్తోన్న ‘పొరుగు దేశానికి తొలి ప్రాధాన్యం’ విధానాన్ని ప్రచండ ఈ సందర్భంగా కొనియాడారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన బుధవారం భారత్కు చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.