చెన్నూరులో లోకేశ్ పాదయాత్ర.. భారీ యువగళం జెండా, గజమాలతో స్వాగతం
తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 117వ రోజు కమలాపురం నియోజకవర్గంలో యాత్ర కొనసాగగా.. తెదేపా నాయకలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ నాయకుడికి గజమాలతో స్వాగతం పలికారు. చెన్నూరు మండలం కొండపేట బ్రిడ్జి వద్ద 650 మీటర్ల భారీ యువ గళం జెండాతో లోకేశ్కు తెదేపా శ్రేణులు స్వాగతం పలికాయి.
Updated : 05 Jun 2023 19:24 IST
Tags :