Guntur Kaaram: ‘గుంటూరు కారం’ మెలోడి.. ‘ఓ మై బేబీ’ వచ్చేసింది

2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఒకటి. మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీలీల (Sree Leela), మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఓ  పాటను విడుదల చేయగా తాజాగా మరో గీతాన్ని రిలీజ్‌ చేసింది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby) అంటూ సాగే ఈ మెలోడిని రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. శిల్పారావు ఆలపించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రోమో ఫుల్‌ సాంగ్‌పై శ్రోతల్లో ఆసక్తి రేకెత్తించింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 13 Dec 2023 18:13 IST

2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఒకటి. మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీలీల (Sree Leela), మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఓ  పాటను విడుదల చేయగా తాజాగా మరో గీతాన్ని రిలీజ్‌ చేసింది. ‘ఓ మై బేబీ’ (Oh My Baby) అంటూ సాగే ఈ మెలోడిని రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. శిల్పారావు ఆలపించారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ప్రోమో ఫుల్‌ సాంగ్‌పై శ్రోతల్లో ఆసక్తి రేకెత్తించింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని