
క్రైమ్
రామసముద్రం: హింసకు ప్రేరేపించేలా సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్రమోదీపై పోస్టులు పెట్టిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చిత్తూరు జిల్లా రామసముద్రం ఎస్సై రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రామసముద్రం మండలం దిగువపేటకు చెందిన ఆదిల్, దాదాపీర్ అనే ఇద్దరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు భాజపా మండల నాయకులు నాగభూషణం, కృష్ణమూర్తి, శ్రీనివాస్, చలపతి సోమవారం ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.