
తాజా వార్తలు
బిజినెస్ మొదలెట్టిన ఆనంద్ దేవరకొండ
హైదరాబాద్: యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ‘మిడిల్క్లాస్ మెలొడీస్’ చిత్రం పారితోషికంతో బిజినెస్ ఆరంభించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘‘మిడిల్క్లాస్ మెలొడీస్’ నాకు తొలి పెద్ద విజయాన్ని, చెక్కును ఇచ్చింది. అంతేకాదు మీ ప్రేమ నాలో బలంతోపాటు ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఈ విజయాన్ని పంచుకుంటూ మొదటి అడుగుగా నా స్నేహితుడితో కలిసి ఫుడ్ డ్రీమ్స్లో పెట్టుబడి పెట్టా. విజయ్కు, నాకు సక్సెస్ ఇచ్చిన సినిమా కథాంశాలన్నీ ఆహారం-డ్రీమ్స్ చుట్టూ సాగినవే. అందుకే నా మొదటి పారితోషికంతో మీకు రుచికరమైన ఆహారం తినిపించాలని, నా స్నేహితులకు సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకున్నా. మేమంతా ఎన్నో కలలు కంటూ కలిసి పెరిగాం’ అని పేర్కొన్నారు. హోటల్కు ‘గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్’ అనే పేరు పెట్టినట్టు ఆనంద్ దేవరకొండ తెలిపారు. హైదరాబాద్లోని ఖాజాగూడలో దీన్ని ఏర్పాటు చేశారు.
‘దొరసాని’ సినిమాతో ఆనంద్ హీరోగా కెరీర్ ఆరభించారు. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించిన ఇదే సినిమాతో ప్రముఖ నటుడు రాజశేఖర్ కుమార్తె శివాత్మిక నటిగా అరంగేట్రం చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా నటులుగా ఆనంద్, శివాత్మికకు గుర్తింపు తెచ్చింది. దీని తర్వాత ఆనంద్ ‘మిడిల్క్లాస్ మెలొడీస్’లో నటించారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్హౌస్లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ఇక చాలు
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- సాహో భారత్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
