
తాజా వార్తలు
‘వాలిమై’లో అజిత్ స్టంట్ చూశారా..?
ఇంటర్నెట్ డెస్క్: తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. కాగా.. సినిమా సెట్స్ నుంచి ఒక అదిరిపోయే ఫొటో బయటికి రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆ ఫొటోలో హీరో అజిత్ బైక్పై స్టంట్ చేస్తూ కనిపించాడు. ముందు చక్రాన్ని గాల్లోకి లేపి బైక్ నడిపిస్తూ ఉన్నాడు. ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం కరోనా వల్ల ఆగిపోయింది. లాక్డౌన్ ముగియడంతో పాటు ప్రభుత్వం చిత్రీకరణకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ చిత్ర బృందం సెట్స్కు చేరుకుంది. ఇటీవల బైక్ స్టంట్ చేస్తున్న క్రమంలో అజిత్కు గాయమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక్కడే అజిత్పై పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో హ్యుమా కూరేషి, టాలీవుడ్ నటుడు కార్తికేయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా స్వరాలు అందిస్తున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
