భక్తుని ప్రశ్నించిన హనుమంతుడు

మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్లబండిలో ఇంటికి బయల్దేరాడు.

Published : 09 May 2024 00:15 IST

మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్లబండిలో ఇంటికి బయల్దేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా, బండి దిగకుండా.. ఆంజనేయుని ధ్యానించాడు. స్వామి ప్రత్యక్షం కాగా.. బండిని బురదలోంచి తప్పించమని అడిగాడు. ‘త్రేతాయుగంలో సీతమ్మను వెదికేందుకు లంకకు ప్రయాణం, వారధి నిర్మాణం.. అలా నేనెంత ప్రయత్నించానో, ప్రయాస చెందానో నీకు తెలీదా?! నా ప్రయత్నానికి శ్రీరామచంద్రుని కృప తోడయ్యింది. అందువల్లే నాకు మంచి సేవకుడనే గౌరవంతోపాటు రాముడి అరుదైన ఆలింగనం దక్కింది. మరి నువ్వేమో బండి దిగకుండా, కాలు కదపకుండా, వానకు తడవకుండా నాతోనే పని చేయించాలని చూస్తున్నావు. ఇదెక్కడి న్యాయం భక్తా? ముందు నీ వంతు ప్రయత్నం చేస్తే.. నేను కూడా ఓ చెయ్యి వేస్తాను’ అంటూ అంతర్థానమయ్యాడు. రైతుకు కళ్లు తెరుచుకున్నాయి. వెంటనే తన ప్రయత్నం మొదలుపెట్టాడు. భక్తుడి బండిని బురదలోంచి బయటకు వచ్చేలా చేశాడు హనుమంతుడు. కృషి లేనిదే దేవుడైనా సాయం చేయడు- అంటూ స్వామి సుందర చైతన్యానంద చెప్పిన కథ ఇది. లోతైన అంశాలను తేలికైన కథలుగా చెబుతుంటారాయన.  

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు