నోటీస్బోర్డు 1
న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....
ప్రభుత్వ ఉద్యోగాలు
యూపీఎస్సీ- 85 పోస్టులు
న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 85 పోస్టులు: చీఫ్ డిజైన్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, అసిస్టెంట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. చివరితేది: ఏప్రిల్ 02, 2020.
వెబ్సైట్: https://www.upsc.gov.in/
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, గుంటూరు
చెన్నైలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం... గుంటూరు(ఏపీ) అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. రాష్ట్రానికి చెందిన 7 జిల్లాలవారు (అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం) దీనికి అర్హులు.
*ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
పోస్టులు: సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్/ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ కేటగిరీ. అర్హత: ఎనిమిదో తరగతి, పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు: 17-23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్(పీఎఫ్టీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(పీఎంటీ), మెడికల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా. ర్యాలీ నిర్వహణ తేది: 2020, మే 05 నుంచి 17 వరకు.
ర్యాలీ ప్రదేశం: భారతీయార్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియం, కోయంబత్తూరు(తమిళనాడు). దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 వరకు.
వెబ్సైట్: http://www.joinindianarmy.nic.in/
టీహెచ్ఎస్టీఐ, ఫరీదాబాద్
ఫరీదాబాద్లోని భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (టీహెచ్ఎస్టీఐ) కింది అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 29 పోస్టులు: సీనియర్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్లైన్. చివరితేది: ఏప్రిల్ 08, 2020. వెబ్సైట్: https://thsti.in/
ప్రవేశాలు
సీయూసెట్ - 2020
దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే సీయూసెట్-2020 ప్రకటన విడుదలైంది. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది.
* సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూసెట్) - 2020
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా. రాతపరీక్ష తేది: 2020 మే 30, 31.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 16, 2020. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 11, 2020.
వెబ్సైట్: https://cucetexam.in/
ఐఐఐటీఎం, కేరళ
కేరళలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(ఐఐఐటీఎం-కే) 2020-21 విద్యాసంవత్సరానికి కింది పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రోగ్రాములు: ఎంఎస్సీ, ఎంఫిల్ విభాగాలు: కంప్యూటర్ సైన్స్ (సైబర్ సెక్యూరిటీ, మెషిన్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, జియోస్పేషియల్ అనలిటిక్స్), ఎకలాజికల్ ఇన్ఫర్మాటిక్స్. అర్హత: పీజీ ప్రోగ్రాములకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఫిల్ ప్రోగ్రాములకు ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్ ఉత్తీర్ణత, గేట్/ నెట్ అర్హత. ఎంపిక విధానం: ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష తేది: 2020, జూన్ 13. దరఖాస్తు విధానం: ఆన్లైన్.
దరఖాస్తుకు చివరితేది: 2020, మే 22.
వెబ్సైట్: https://www.iiitmk.ac.in/
వాక్-ఇన్స్
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే
గువాహటి(మాలేగావ్) ప్రధానకేంద్రంగా ఉన్న నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 29
పోస్టులు: పీజీటీ, టీజీటీ, ప్రైమరీ టీచర్
సబ్జెక్టులు: జువాలజీ, బయాలజీ, హిస్టరీ, ఎకనమిక్స్, ఇంగ్లిష్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్ ఉత్తీర్ణత, అనుభవం.
వాక్ఇన్ తేది: 2020 మార్చి 30, 31.
వేదిక: జనరల్ మేనేజర్, జీఎం ఆఫీస్ కాంప్లెక్స్, మాలేగావ్, నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, గువాహటి.
వెబ్సైట్: https://nfr.indianrailways.gov.in/
మరిన్ని నోటిఫికేషన్లకు QR కోడ్ స్కాన్ చేయవచ్చు లేదా www.eenadupratibha.net చూడవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్