నోటిఫికేషన్స్
ఒడిశా రాష్ట్రం అంగుల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలు
నాల్కోలో సూపరింటెండెంట్, ఆపరేటర్లు
ఒడిశా రాష్ట్రం అంగుల్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. సూపరింటెండెంట్: 02 పోస్టులు
2. ఆపరేటర్: 15 పోస్టులు
అర్హత: మెట్రిక్యులేషన్, ఐటీఐ, బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్తో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-09-2022.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 28-09-2022.
వెబ్సైట్: https://nalcoindia.com/
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ కొలువులు
బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- కేఐవోసీఎల్ లిమిటెడ్ కింది విభాగాల్లో 35 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మైనింగ్, కంప్యూటర్ సైన్స్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2021/2022 స్కోరు ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2022.
దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 30-09-2022.
వెబ్సైట్: https://kioclltd.in/
సీఎన్సీఐ, కోల్కతాలో స్పెషలిస్ట్ పోస్టులు
కోల్కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ ప్రాతిపదికన 27 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
* స్పెషలిస్ట్ గ్రేడ్-1: 10 పోస్టులు,
* స్పెషలిస్ట్ గ్రేడ్-2: 17 పోస్టులు
విభాగాలు: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, సర్జికల్ ఆంకాలజీ, యూరో ఆంకాలజీ, ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ (గైనకాలజీ ఆంకాలజీ), అనస్తీషియాలజీ, సర్జికల్ ఆంకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎం, డీఎన్బీ, ఎంసీహెచ్, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: ఎస్జీ-1 పోస్టులకు 50 ఏళ్లు, ఎస్జీ-2 పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2022.
వెబ్సైట్: https://www.cnci.ac.in/
ప్రవేశాలు
ఏయూ దూరవిద్యలో డిగ్రీ, పీజీ కోర్సులు
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2022-23 విద్యా సంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఓపెన్, డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్
1. గ్రాడ్యుయేట్ కోర్సులు (బీఏ, బీకాం, బీఎస్సీ)
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు (ఎంఏ, ఎంజేఎంసీ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ)
3. ఏడాది పీజీ డిప్లొమా కోర్సులు
4. ఆరు నెలల సర్టిఫికేట్ కోర్సులు
ఆన్లైన్ ప్రోగ్రామ్స్
1. బీకాం(అకౌంటెన్సీ)
2. ఎంఏ(సోషియాలజీ)
అర్హత: ఇంటర్, డిగ్రీ.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-09-2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2022.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 31-10-2022.
వెబ్సైట్: https://www.andhrauniversity.edu.in/
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం