బీమా రంగంలోకి తొలిమెట్టు ఏసెట్‌!

వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు ఉన్నట్లుగానే యాక్చూరియల్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారి కోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌) నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ అర్హత ఉన్నవారు దీనికి హాజరుకావచ్ఛు ప్రస్తుతం ఈ పరీక్షకు ప్రకటన వెలువడింది!

Published : 28 Jan 2020 01:07 IST

వివిధ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు ఉన్నట్లుగానే యాక్చూరియల్‌ సైన్స్‌లో ఆసక్తి ఉన్నవారి కోసం యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌) నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ అర్హత ఉన్నవారు దీనికి హాజరుకావచ్ఛు ప్రస్తుతం ఈ పరీక్షకు ప్రకటన వెలువడింది!

బీమా, అనుబంధ రంగాలు, ఆర్థిక, మదింపు సంస్థల్లో కెరియర్‌ ఆశించేవారు ప్రయత్నించదగిన కోర్సు యాక్చూరియల్‌ సైన్స్‌. అంకెలపై ఆసక్తి, గణితంపై పట్టు, తర్కం ఉంటే ఈ కోర్సులో రాణించడానికి ఆస్కారం ఎక్కువ.

పరీక్ష విధానం

ఆన్‌లైన్‌లో వంద మార్కులకు దేశవ్యాప్తంగా 24 కేంద్రాల్లో ఒకే రోజు, ఒకే స్లాట్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 70 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున సెక్షన్‌-ఎలో 45 ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్‌-బిలో 20 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నకు రెండేసి మార్కులు కేటాయించారు. సెక్షన్‌-సిలో 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కోదానికి 3 మార్కులు. సబ్జెక్టులవారీగా.. మ్యాథ్స్‌ 30, స్టాటిస్టిక్స్‌ 30, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 15, ఇంగ్లిష్‌ 15, లాజికల్‌ రీజనింగ్‌ 10 మార్కులుంటాయి. రుణాత్మక మార్కులు లేవు. పరీక్షలో అర్హత సాధించడానికి కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.

ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌, చదవాల్సిన రిఫరెన్స్‌ పుస్తకాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఈ వ్యవధిలోగా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఐ)లో సభ్యత్వాన్ని పొందవచ్ఛు ఇలా చేరినవారు యాక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులో వివిధ పేపర్లను పూర్తిచేసుకోవచ్ఛు

మొత్తం 13 పేపర్లు

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు యాక్చూరీ ఫెలో కావడానికి 13 పేపర్లు వివిధ దశల్లో పూర్తిచేయాలి. స్టేజ్‌-1 కోర్‌ ప్రిన్సిపల్స్‌, స్టేజ్‌ -2 కోర్‌ ప్రాక్టీసెస్‌ ఈ రెండూ అందరికీ ఉమ్మడిగా ఉంటాయి. స్టేజ్‌-1లో 7, స్టేజ్‌-2లో 3 పేపర్లు ఉంటాయి. ఈ రెండు దశలనూ పూర్తిచేసినవారిని అసోసియేట్‌గా పరిగణిస్తారు. స్టేజ్‌-3 స్పెషలిస్ట్‌ ప్రిన్సిపల్‌, స్టేజ్‌-4 స్పెషలిస్ట్‌ అడ్వాన్స్‌డ్‌. స్టేజ్‌-3లో 8 నుంచి 2 పేపర్లు ఎంచుకుని పూర్తిచేయాలి. స్టేజ్‌-4లో ఉన్నవాటిలో నచ్చిన ఏదైనా ఒకటి రాసుకోవచ్ఛు నాలుగు దశలూ (13 పేపర్లు) పూర్తి చేసుకుంటే ఫెలోగా వ్యవహరిస్తారు. ఒక్క స్టేజ్‌-1 పాసైనా కొలువు లభిస్తుంది. 13 పేపర్లూ పూర్తిచేసుకున్నవారికి నెలవేతనం రూ. అయిదు లక్షలకు పైగా లభిస్తుంది. 3 పేపర్లు పూర్తిచేసుకున్న గ్రాడ్యుయేట్లూ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇన్సూరెన్స్‌, రీ ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్‌, అకడమిక్‌, రెగ్యులేటరీ.. తదితర సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.


ప్రవేశపరీక్షకు అర్హత ఇంటర్మీడియట్‌

రిజిస్ట్రేషన్ల గడువు జనవరి 28


అర్హత: ఇంటర్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు

రిజిస్ట్రేషన్లు: జనవరి 28 సాయంత్రం 3 గంటల వరకు స్వీకరిస్తారు

పరీక్ష తేదీ: ఫిబ్రవరి 29

ఫలితాలు: మార్చి 7న వెలువడతాయి

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: www.actuariesindia.org


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని