Career Guidance: పరీక్షల సమయం.. ఫోనుకు విరామం ఇచ్చేద్దాం
భవ్యకి పరీక్షలు జరుగుతున్నాయి. శ్రద్ధగా చదువుతున్నా..మధ్యమధ్యలో ఫోను పట్టుకోకుండా ఉండలేక పోతోంది. ఏదో డౌట్ ఉందనో, మెటీరియల్ కావాలనో ఫోన్ తీసుకోవడం.. అలా దానితోనే కాలక్షేపం అయిపోయి సమయం వృథా కావడం మామూలైపోయింది. మరి ఇలా అయితే
భవ్యకి పరీక్షలు జరుగుతున్నాయి. శ్రద్ధగా చదువుతున్నా..మధ్యమధ్యలో ఫోను పట్టుకోకుండా ఉండలేక పోతోంది. ఏదో డౌట్ ఉందనో, మెటీరియల్ కావాలనో ఫోన్ తీసుకోవడం.. అలా దానితోనే కాలక్షేపం అయిపోయి సమయం వృథా కావడం మామూలైపోయింది. మరి ఇలా అయితే మంచి మార్కులెలా వస్తాయి? ఈ సమయంలో ఫోన్ వాడకం తగ్గించడం ఎలా? అలా తగ్గిస్తే కలిగే లాభాలేంటి?
ప్రస్తుతం సోషల్ మీడియా వాడని విద్యార్థులు లేరనే చెప్పొచ్చు. నేటి జీవనశైలికి మొబైల్ను పూర్తిగా వాడకుండా ఉండటం సాధ్యం కాదు. అలాగని పరీక్షల వంటి ముఖ్యమైన సమయాల్లో గంటల తరబడి వాటిని ఉపయోగించడం సరికాదు. వివిధ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించిన టాపర్లు, గొప్ప గొప్ప ప్లేయర్లు... కీలకమైన సమయాల్లో ఫోనును అస్సలు ఉపయోగించరు. వారి ఫోకస్ మొత్తం పూర్తిగా ఆ టాస్క్పైనే పెడతారు. విద్యార్థులు కూడా ప్రస్తుతం పరీక్షలపైనే పూర్తిగా ఫోకస్ పెడితే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
* ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్... ఇలా ఫోన్లో కొన్ని యాప్స్కు మనం బాగా అలవాటు పడిపోయాం. ఈ సమయంలో వాటిని అతి తక్కువగా మాత్రమే వినియోగించాలి. అవసరమైతే కొద్దిరోజులపాటు పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసేసినా, అకౌంట్స్ ఇన్యాక్టివ్ చేసినా ఇబ్బంది లేదు.
* కొందరు విద్యార్థులు పూర్తిగా ఫోన్ వాడను అని నిర్ణయించుకుని, అలా ఉండలేక ఒత్తిడికి గురవుతుంటారు. తల్లిదండ్రులు కూడా ఫోన్ తీస్తే తిట్టడం వంటివి చేస్తూ ఉంటారు, అది సరికాదు. ఇన్నాళ్లుగా అలవాటు పడినదానికి హఠాత్తుగా దూరంగా ఉండాలంటే ఎవరికైనా కష్టమే. పరీక్షల సమయంలో అలాంటి అదనపు ఒత్తిడి ఉండకూడదు. ఇప్పటికి పరిమితిలో వాడేలా సాధన చేయడమే ఉత్తమం.
* చాలాసేపు చదువుకున్నాం కదా.. కాసేపు రిలాక్స్ అవుదాం అని ఫోన్ తీసే విద్యార్థులు చాలామంది ఉంటారు. అయితే అది సరైన పద్ధతి కాదు. అప్పటివరకూ కళ్లపై పడిన ఒత్తిడి చాలదా, మళ్లీ ఫోన్ ఎందుకు? ఇంట్లో వాళ్లతో సరదాగా మాట్లాడటం, కాసేపు అలా బయట నడవటం వల్ల శరీరం, మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. తిరిగి బాగా చదువుకునేందుకు ఉత్సాహం కలుగుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు