Postal Jobs: తపాలాశాఖలో 40,889 ఉద్యోగాలు.. షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల రెండో జాబితా ఇదే!
గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ జనవరిలో భారీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 40,889 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాను మార్చిలో విడుదల చేయగా.. తాజాగా అనుబంధ జాబితాను ప్రకటించింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ రెండో జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 21లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించింది. ఆ తర్వాత నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ జీడీఎస్ జాబితా-2 కోసం క్లిక్ చేయండి
తెలంగాణ జీడీఎస్ జాబితా-2 కోసం క్లిక్ చేయండి
రోజుకు నాలుగు గంటలు విధులు
ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న