JNVST 2024: ‘నవోదయ’లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు మళ్లీ పొడిగింపు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు.
దిల్లీ: రాబోయే విద్యా సంవత్సరానికి (2024-25) నవోదయ విద్యాలయాల్లో (JNV) ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల గడువును జవహర్ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. ఆగస్టు 17తో గడువు ముగియనుండగా.. తుది గడువును ఆగస్టు 25కు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో అర్హులైన విద్యార్థులు ఆగస్టు 25వరకు దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఏర్పడింది. తొలుత ఆగస్టు 10వ తేదీతో గడువు ముగియగా.. వారం రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గడువు నేటితో ముగియనుండటంతో తాజాగా ఆగస్టు 25వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
7 నోటిఫికేషన్లు.. 46,500+ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
జేఎన్వీల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST 2024) నిర్వహించాలని అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. నవంబర్ 4(శనివారం)న ఉదయం 11.30గంటలకు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో; 2024 జనవరి 20 (శనివారం) తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష(Jawahar Navodaya Vidyalaya selection test) నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉండగా.. ఏపీలో 15, తెలంగాణలో 9 చొప్పున ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే