APPLY NOW: పది, ఐటీఐతో టెక్నీషియన్‌ పోస్టులు.. వేతనం ₹69వేలు.. త్వరగా అప్లై చేసుకోండి!

ఇస్రోకు చెందిన ఎన్‌ఆర్‌ఎస్‌సీలో టెక్నీషియన్‌ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు సమీపిస్తోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 31 (ఆదివారం) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 25 Dec 2023 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హైదరాబాద్‌లోని ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)లో ఉద్యోగాలకు దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తోంది. పలు విభాగాల్లో మొత్తం 54 టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు డిసెంబర్‌ 31వరకు ఆహ్వానించనున్నారు. పదోతరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కొలువుల కోసం https://www.nrsc.gov.in/  దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం పోస్టులు 54 కాగా.. టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్, మెకానిక్‌) 33 పోస్టులు.. ఎలక్ట్రికల్‌లో 8; ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ 9;  ఫొటోగ్రఫీ, డీటీపీ ఆపరేటర్‌ రెండు పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. 
  • విద్యార్హత: అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వేతనం: లెవెల్‌ -3 పే కింద నెలకు రూ.21,700- రూ.69,100 వరకు చెల్లిస్తారు.
  • దరఖాస్తులు: డిసెంబర్‌ 31 సాయంత్రం 5గంటల వరకు చేయవచ్చు. ఈ ఉద్యోగాలు తాత్కాలికమైనవే.. కానీ కొనసాగించే అవకాశాలు ఉంటాయి.  
  • వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు డిసెంబర్‌ 31 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.  ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: రూ.100. అయితే, ప్రాసెసింగ్‌ ఫీజు కింద మరో రూ.500లు చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తర్వాత ఈ మొత్తాన్ని రిఫండ్‌ చేస్తారు. 
  • ఎంపిక విధానం: రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్  ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 80 ప్రశ్నలు అడుగుతారు. 1.50గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది. తప్పు సమాధానం రాస్తే 0.33 మార్కులు కోత విధిస్తారు. స్కిల్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. రాత పరీక్షలో తుది జాబితా ఆధారంగా స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌, కరీంనగర్‌. మరింత సమాచారం ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని