Stock market: రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Published : 06 May 2024 16:02 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు (stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. రోజంతా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో సెన్సెక్స్‌ స్వల్పంగా లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా నష్టపోయి 22,400 స్థాయికి చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 74,196.68 పాయింట్ల (క్రితం ముగింపు 73,878.15 పాయిట్లు) వద్ద లాభాల్లో ప్రారంభమైంది. తర్వాత ఓ మోస్తరు లాభాల్లో కొనసాగిన తర్వాత ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 73,786.29 - 74,359.69 మధ్య చలించింది. చివరికి 17.39 పాయింట్ల లాభంతో 73,895.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.15 పాయింట్లు నష్టపోయి 22,442.70 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, టీసీఎస్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు రాణించగా.. టైటాన్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎల్‌ అండ్‌టీ షేర్లు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.50గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 83.70 డాలర్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని