సెంచరీ గుడ్డు.. పోషకాల్లో రారాజు!
సెంచరీ ఎగ్’ పేరు ఎక్కడైనా విన్నారా? దీన్ని చైనీస్ ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా అయితే చదివేయండి మరి! చైనాను 18వ శతాబ్దంలో మింగ్ రాజ వంశస్థులు పాలించేవారు.
‘సెంచరీ ఎగ్’ పేరు ఎక్కడైనా విన్నారా? దీన్ని చైనీస్ ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అసలు దీని ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలనుందా అయితే చదివేయండి మరి! చైనాను 18వ శతాబ్దంలో మింగ్ రాజ వంశస్థులు పాలించేవారు. ఆ కాలంలో ఈ వంటకం ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఓసారి కుండలో సాధారణ గుడ్లను పెట్టి ఆరునెలల పాటు అలాగే వదిలేశారట. తర్వాత తీసి చూస్తే పెంకు గట్టిగా మారిపోయింది. ఒలిచి చూస్తే తెల్లసొన ముదురు ఎరుపు రంగు, పచ్చసొన నలుపుగా మారాయట. గుడ్డు పట్టుకుంటే జెల్లాగా మృదువుగా చేతికి అంటుకోకుండా ఉందట. దీన్ని ఒకసారి ప్రయత్నించి చూస్తే ఎలా ఉంటుందోనని తిన్నారు. రుచి బాగుంది. ఇంకేం.. అప్పటి నుంచి చైనీయుల ఆహారంలో భాగమైంది. ఈ గుడ్డు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండోయ్. ఏ, బీ, డీ విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే దీన్నుంచి లభించే క్యాలరీలు, కొలెస్ట్రాల్ తక్కువే. సూప్లు, సలాడ్ల నుంచి ఏ వంటకంలోనైనా వాడేస్తారు. దీన్ని నేరుగా తినే వారూ ఎక్కువే. అక్కడి మార్కెట్లలో కూడా ఈ సెంచరీ గుడ్లు విరివిగా దొరుకుతాయి. చాలా మంది ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఇన్ని పోషకాలున్న ఈ గుడ్డుని గర్భిణిలు, పిల్లలకు మాత్రం దూరంగా ఉంచుతారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం