ప్రతి నెలాఖరుకు ఈపీఎఫ్‌ పింఛను

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పింఛనుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రతి నెలా చివరి పని దినం రోజున ఆ నెలకు సంబంధించిన పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది.

Published : 17 Jan 2022 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) పింఛనుదారులకు శుభవార్త. ఇక నుంచి ప్రతి నెలా చివరి పని దినం రోజున ఆ నెలకు సంబంధించిన పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) పింఛను విభాగం ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ విశాల్‌ అగర్వాల్‌.. ఈపీఎఫ్‌ క్షేత్ర స్థాయి కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. పింఛను పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలను జారీ చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని