తెదేపా శ్రేణులపై దాడి జరుగుతుంటే..పోలీసులేం చేస్తున్నారు?
తెదేపా కార్యకర్తల అరెస్టుపై నిరసనలు తెలియజేసే వారిపై పోలీసులతో దాడి చేస్తారా అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
ఈనాడు, అమరావతి: తెదేపా కార్యకర్తల అరెస్టుపై నిరసనలు తెలియజేసే వారిపై పోలీసులతో దాడి చేస్తారా అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తెదేపా నేతలతో మాట్లాడారు.ఆసుపత్రిలో ఉన్న బాధితుడితో ఆదివారం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవిందబాబు, ఇతర నేతలపై పోలీసులే దౌర్జన్యం చేయడం వారి వైఖరికి అద్దం పడుతోంది. అస్వస్థతకు గురైన నాయకులను తరలించే అంబులెన్స్పైనా దాడికి దిగడం వైకాపా అరాచకానికి నిదర్శనం. ఇంత జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారు. ఇది వారి వైఫల్యం కాదా’ అని విమర్శించారు. ఘర్షణకు కారణమైన వైకాపా కార్యకర్తలతోపాటు పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్