Raghurama: బొత్స అందుకే.. హైదరాబాద్ని రాజధానిగా అన్నారేమో!
ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదేనని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రం సంధించారు. అమరావతి నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు ప్రతిసారీ వెళ్లిరావాలంటే రోజుకు రూ.60 లక్షల ఖర్చవుతుందని ఇదివరకు ముఖ్యమంత్రి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారని, ఆ ఖర్చును తగ్గించడానికి సీఎం హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తూ, అక్కడి నుంచే కోర్టుకు వెళ్లిరావడానికి సౌకర్యంగా ఉంటుందని బొత్స ఆ వ్యాఖ్యలు చేశారేమో...
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదేనని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యంగ్యాస్త్రం సంధించారు. అమరావతి నుంచి హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు ప్రతిసారీ వెళ్లిరావాలంటే రోజుకు రూ.60 లక్షల ఖర్చవుతుందని ఇదివరకు ముఖ్యమంత్రి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారని, ఆ ఖర్చును తగ్గించడానికి సీఎం హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తూ, అక్కడి నుంచే కోర్టుకు వెళ్లిరావడానికి సౌకర్యంగా ఉంటుందని బొత్స ఆ వ్యాఖ్యలు చేశారేమో తెలియదని పేర్కొన్నారు. ఆయన మంగళవారం దిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ... అమరావతిపై చట్టాలు చేసే అధికారం లేదని కోర్టు చెప్పలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు శాసనసభ ఏకగ్రీవంగా చేసిన చట్టాన్ని అమలు చేయాలని మాత్రమే చెప్పిందన్నారు. దాన్ని అర్థం చేసుకోకుండా హైకోర్టుపై నిందలు వేస్తున్నారన్నారు. శాసనమండలి రద్దుచేస్తున్నట్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపిన తర్వాత ముఖ్యమంత్రి దాన్ని ఉపసంహరించుకున్నట్లుగానే అమరావతి విషయంలోనూ మనసు మార్చుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు నేరుగా రూ.1.32 లక్షల కోట్లు ఇచ్చినట్లు గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారని, కానీ... అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4 లక్షల కోట్ల అప్పులు చేసిన విషయాన్ని చెప్పలేదన్నారు. రాష్ట్రంలో ఈ మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులూ చేయలేదని, అందువల్ల రూ.4 లక్షల కోట్ల అప్పుల్లో ప్రజలకు నేరుగా పంపిణీ చేసిన రూ.1.32 లక్షల కోట్లు పోతే మిగిలిన రూ.2.68 లక్షల కోట్లు ఏం చేశారో ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం 71% పూర్తిచేస్తే, ఈ ప్రభుత్వం మూడేళ్లలో 6% పూర్తిచేసిందని, మిగిలింది ఎన్నేళ్లకు పూర్తిచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంత్రి గౌతంరెడ్డికి నివాళులర్పించి... మాజీ సీఎం రోశయ్యను విస్మరించడాన్ని రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. పేదలకు చౌకగా సినిమా చూపెట్టాలన్న ఉద్దేశంతో ఇదివరకు సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్లు చెప్పిన సీఎం ఎప్పుడు అదే పేదలకు అన్యాయం చేయడానికి ధరలను పెంచారా? అని ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ప్రధాని మోదీ తండ్రిలా చూసుకుంటున్నారన్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలను స్వాగతించారు. అప్పుల్లోపడి చెడిపోతున్న కొడుకును తండ్రి సరిదిద్దినట్లుగానే ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రిని సరిదిద్ది రాష్ట్రానికి మేలు చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా