Andhra News: తెదేపా కార్యకర్తపై కారం చల్లి.. ఇనుపరాడ్లతో దాడి
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కాకాని ఏసురాజుపై వైకాపా వర్గీయులు కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు,
వైకాపా వర్గీయుల పనేనన్న బాధితుడి భార్య
రొంపిచర్ల ఎంపీపీ భర్త, వాలంటీర్లు కలిసి హతమార్చబోయారని ఆరోపణ
రొంపిచర్ల, నరసరావుపేట పట్టణం, న్యూస్టుడే: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కాకాని ఏసురాజుపై వైకాపా వర్గీయులు కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కాకాని ఏసురాజు ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లాడు. అక్కడి నుంచి మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై అలవాల తిరిగి వస్తుండగా.. తురిమెళ్ల- అచ్చయ్యపాలెం గ్రామాల మధ్యకు రాగానే వైకాపాకు చెందిన 11 మంది ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. ఏసురాజుపై కారం చల్లి ఇనుపరాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏసురాజును అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుడు బంధువులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు..
కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న రాజుపై రొంపిచర్ల ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, వాలంటీర్లు గోపాల్, నాగరాజు, మరికొందరు కారం చల్లి ఇనుప రాడ్లు, బండరాళ్లతో తీవ్రంగా కొట్టారని క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఏసురాజు చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారన్నారు. ఏసురాజు భార్య మరియ కుమారి, తల్లి సింగమ్మ నరసరావుపేట ఏరియా ఆసుపత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా నేత అరవిందబాబుకు మద్దతు తెలిపినందుకు తమ కుటుంబంపై ఎంపీపీ భర్త వెంకట్రావు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఏసురాజును హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఇటీవల అలవాలలో తిరునాళ్ల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంలో ఏసురాజుపై హత్యాయత్నం కేసు పెట్టి, వేధించారని చెప్పారు. రొంపిచర్ల ఎస్సై అండదండలతో వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా