
Andhra News: తెదేపా కార్యకర్తపై కారం చల్లి.. ఇనుపరాడ్లతో దాడి
వైకాపా వర్గీయుల పనేనన్న బాధితుడి భార్య
రొంపిచర్ల ఎంపీపీ భర్త, వాలంటీర్లు కలిసి హతమార్చబోయారని ఆరోపణ
రొంపిచర్ల, నరసరావుపేట పట్టణం, న్యూస్టుడే: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త కాకాని ఏసురాజుపై వైకాపా వర్గీయులు కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కాకాని ఏసురాజు ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లాడు. అక్కడి నుంచి మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై అలవాల తిరిగి వస్తుండగా.. తురిమెళ్ల- అచ్చయ్యపాలెం గ్రామాల మధ్యకు రాగానే వైకాపాకు చెందిన 11 మంది ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. ఏసురాజుపై కారం చల్లి ఇనుపరాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఏసురాజును అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుడు బంధువులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు..
కూలి పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న రాజుపై రొంపిచర్ల ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, వాలంటీర్లు గోపాల్, నాగరాజు, మరికొందరు కారం చల్లి ఇనుప రాడ్లు, బండరాళ్లతో తీవ్రంగా కొట్టారని క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఏసురాజు చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారన్నారు. ఏసురాజు భార్య మరియ కుమారి, తల్లి సింగమ్మ నరసరావుపేట ఏరియా ఆసుపత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. తెదేపా నేత అరవిందబాబుకు మద్దతు తెలిపినందుకు తమ కుటుంబంపై ఎంపీపీ భర్త వెంకట్రావు కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఏసురాజును హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. ఇటీవల అలవాలలో తిరునాళ్ల సందర్భంగా చోటుచేసుకున్న చిన్న వివాదంలో ఏసురాజుపై హత్యాయత్నం కేసు పెట్టి, వేధించారని చెప్పారు. రొంపిచర్ల ఎస్సై అండదండలతో వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: దేశంలో 1.11 లక్షలకు చేరిన యాక్టివ్ కేసులు
-
World News
Israel: హెజ్బొల్లా డ్రోన్లను కూల్చిన ఇజ్రాయెల్..!
-
Sports News
Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
-
Business News
Crypto crash: క్రిప్టో క్రాష్.. ఇంకా ఎంత దూరం?
-
Movies News
Samantha: కరణ్.. అన్హ్యాపీ మ్యారేజ్కి మీరే కారణం: సమంత
-
Ts-top-news News
JNTUH: ఆన్లైన్లో చదువుకో.. నైపుణ్యం పెంచుకో: జేఎన్టీయూహెచ్లో సర్టిఫికెట్ కోర్సులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03-07-2022)
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు