Mekapati Goutham Reddy: గౌతమ్రెడ్డి హఠాన్మరణం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో
హైదరాబాద్లోని నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిన ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి
హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలింపు
వైద్యులు గంటన్నర ప్రయత్నించినా దక్కని ఫలితం
తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎంలు జగన్, కేసీఆర్తోపాటు తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి
రాష్ట్రంలో రెండు రోజులు సంతాప దినాలు
రేపు ఉదయగిరిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
ఈనాడు, హైదరాబాద్, అమరావతి - న్యూస్టుడే, ఫిల్మ్నగర్: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన స్వగృహంలో తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు కారులో ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యవసర విభాగంలో చేర్చిన వైద్యులు కార్డియో పల్మనరీ రిససటేషన్ (సీపీఆర్) చేశారు. ఎంత ప్రయత్నించినా గౌతమ్రెడ్డిలో చలనం లేకపోవడంతో ఉదయం 9.16 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. ‘మంత్రి గౌతమ్రెడ్డి ఉదయం ఇంట్లోనే గుండెపోటుకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. శ్వాస కూడా తీసుకోవడం లేదు. గుండె వైద్యనిపుణులు, అత్యవసర వైద్య సిబ్బంది మంత్రిని రక్షించేందుకు ప్రయత్నించారు. దాదాపు 90 నిమిషాలపాటు సీపీఆర్ చేశారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని అపోలో ఆసుపత్రి వైద్య వర్గాలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి.
ఉదయం 11.40 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రి నుంచి గౌతమ్రెడ్డి భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్లోని నివాసానికి తరలించారు. మంత్రి మృతి వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇతర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నేతను కోల్పోవడం చాలా విషాదకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.
రెండుసార్లు కొవిడ్ నుంచి బయటపడి...
గౌతమ్రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తండ్రి ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి. తండ్రిబాటలోనే రాజకీయ అరంగేట్రం చేసి 2014, 2019ల్లో వరుసగా రెండుసార్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో మంత్రి పదవి వరించింది. వివాదరహితుడిగా.. పరిశ్రమల, ఐటీ శాఖల్లో తనదైన ముద్ర వేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా దుబాయ్లో పర్యటించి, ఆదివారమే నగరానికి తిరిగొచ్చారు. గౌతమ్రెడ్డి రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డారు. మొదటి వేవ్లోనే ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో రెండు, మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండి, కోలుకున్నారు. గత నెల 22న మరోసారి (కరోనా మూడో వేవ్లో) కొవిడ్ బారినపడి ఇంట్లోనే ఐసొలేషన్లో ఉండి కోలుకున్నారు. గుండె ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపించిందా అనే అంశాన్ని కూడా వైద్య వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల గౌతమ్రెడ్డి బాగా శ్రద్ధ చూపుతుంటారు. నిత్యం రెండు గంటలపాటు వ్యాయామం చేస్తుంటారని సన్నిహితులు తెలిపారు. ఆరోగ్యపరంగానూ ఎలాంటి సమస్యలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన హఠాన్మరణాన్ని కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చికిత్సకు స్పందించకపోవడంతో యాంజియోగ్రామ్, ఇతర పరీక్షలు చేయడానికి వీలు కాలేదని వైద్యులు తెలిపారు. దీంతో గుండె కవాటాల్లో ఏవైనా పూడికలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా చెప్పడం కష్టమన్నారు.
హుటాహుటిన అపోలోకు తెలంగాణ మంత్రులు
గౌతమ్రెడ్డి మృతి వార్త తెలియగానే తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, పువ్వాడ అజయ్కుమార్, ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైతెపా అధ్యక్షురాలు షర్మిల, సీఎం జగన్ తల్లి విజయమ్మ, కేవీపీ రామచంద్రరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. గౌతమ్రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు.
గౌతమ్రెడ్డి మృతికి ప్రభుత్వం విచారం
పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మరణానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయన మృతికి నివాళిగా సోమ, మంగళవారాల్ని సంతాప దినాలుగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాల్ని అవనతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. గౌతమ్రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికార లాంఛనాలతో జరుగుతాయని వెల్లడించారు. అమెరికాలో ఉన్న గౌతమ్ కుమారుడు అర్జున్రెడ్డి మంగళవారం రాత్రికి చేరుకొనే అవకాశాలున్నాయి. మృతదేహాన్ని మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి నెల్లూరులోని పోలీస్ పరేడ్గ్రౌండ్కి హెలికాప్టర్లో తరలిస్తారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లి, ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. బుధవారం ఉదయం 11 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది
సోమవారం ఉదయం 7.20 సమయంలో నిద్ర లేచి బయటకు వచ్చిన ఆయన సోఫాలో కూర్చున్నారు. ఒక్కసారిగా గుండెను చేతితో పట్టుకొని విలవిలలాడిపోయారు. గట్టిగా పిలవడంతో కింద ఉన్న నేను పరుగెత్తుకుంటూ పైకి వచ్చాను. అప్పటికే ఆయన కింద పడిపోయి ఉన్నారు. కూర్చోబెట్టి గుండెలపై బాగా వత్తాను. మంచినీళ్లు అడిగారు. తెచ్చి ఇచ్చినా తాగలేదు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు లిఫ్ట్ వద్దకు తీసుకొచ్చేసరికి నాలుక మడతపడింది. నెమ్మదిగా అపస్మారక స్థితికి వెళ్లిపోతున్నారు. కారులో పడుకోబెట్టి 13 నిమిషాల్లోనే ఆసుపత్రికి తీసుకొచ్చాం. కారులో వచ్చేటప్పుడు శ్వాస ఉంది కానీ మాట్లాడలేదు. ఆసుపత్రిలో చేర్పించాం. ఆయన ఉదయం 8 గంటలకు జిమ్కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి రాత్రి 9.30 గంటలకు తిరిగి వచ్చాం. మాకు దేవుడులాంటి మా సార్.. దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నాం. 2003 నుంచి ఆయన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాను. నన్ను ఏనాడూ పనివాడిగా చూడలేదు. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ అభయమిచ్చేవారు.
- నాగేశ్వరరావు, గౌతమ్రెడ్డి డ్రైవర్, ప్రత్యక్షసాక్షి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం