జనవరి జీతాలపై గరం గరం
కొత్త వేతన సవరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు, పింఛన్లు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకు ఆర్థిక, ఖజానా శాఖల అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కొత్త జీతాలు
సీఎఫ్ఎంఎస్లోనే పింఛను బిల్లులు
ట్రెజరీ అధికారులు సరిచూసి పంపాలని ప్రభుత్వ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: కొత్త వేతన సవరణ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలు, పింఛన్లు చెల్లించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అందుకు ఆర్థిక, ఖజానా శాఖల అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు కొత్త జీతాలు, పింఛన్లు వద్దని పీఆర్సీ సాధన సమితి నాయకులు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగీ తమకు పాత విధానంలోనే జనవరి జీతాలు ఇవ్వాలని కోరుతూ తమతమ డ్రాయింగ్ డిస్బర్సుమెంటు అధికారులకు లిఖితపూర్వకంగా విన్నవించాలని సూచిస్తున్నారు. ఇందుకు ఒక నమూనా సిద్ధం చేయనున్నారు. మరోవైపు ఆర్థిక, ఖజానా శాఖల ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఖజానా అధికారులు, ఉద్యోగుల బిల్లులు సమర్పించేందుకు జనవరి 28 (నేటి వరకు) ప్రభుత్వం గడువు విధించింది. డీడీవోలు ఎన్ని బిల్లులు సమర్పించారు? ఎంతమంది అధికారులు వాటిని ప్రాసెస్ చేశారన్న విషయాలపై గురువారం మధ్యాహ్నం ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్రావు సమీక్షించారు. అన్ని జిల్లాల అధికారులు, సబ్ట్రెజరీ అధికారులతో వీడియో సమావేశాలు నిర్వహించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 3,57,528 మంది పింఛనర్ల జనవరి నెల పింఛన్లు కొత్త వేతన స్కేళ్ల ప్రకారమే ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే సీఎఫ్ఎంఎస్లో ఆ బిల్లులన్నీ సిద్ధమయ్యాయి.
జీతాల పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలోని 18,000 డ్రాయింగ్ డిస్బర్సుమెంట్ అధికారుల్లో ఎంతమంది బిల్లులు సమర్పించారనే అంశాన్ని ఉన్నతాధికారులు సమీక్షించారు. ప్రధానంగా వచ్చిన బిల్లుల్లో అధికం పోలీసుశాఖవే ఉన్నాయని తెలిసింది. ఏ సబ్ట్రెజరీ పరిధిలో డీడీవోలు ఎన్ని బిల్లులు సమర్పించారో ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి కొందరితో నేరుగా మాట్లాడారు. బిల్లుల ప్రక్రియ ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగుల ఎస్ఆర్లు పంపాలని కోరితే వారి నుంచి రాలేదని, అందువల్ల వాటిని తాము ప్రాసెస్ చేయలేకపోతున్నామని వారిలో కొందరు చెప్పారు. ఎస్ఆర్లు రాకున్నా ఖజానా అధికారుల వద్ద ఉన్న ఫ్లైలీఫ్ ఆధారంగా ఆ పని పూర్తి చేయాలని ఖజానా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఖజానా అధికారులు ఆ శాఖ బిల్లులు ఎందుకు సిద్ధం చేయలేదనీ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. జనవరి 28 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందని, లేకుంటే చర్యలు తీసుకుంటారని అధికారులు వారికి చెప్పినట్లు తెలిసింది.
పింఛన్లు తీసుకోవద్దు
‘పాత పీఆర్సీ విధానంలోనే తమకు పింఛన్లు ఇవ్వాలని రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. కొత్త విధానంలో పింఛన్లు ఇచ్చినా, సోదర ఉద్యోగులు ఆందోళన విరమించి అనుమతించే వరకూ ఆ సొమ్ములు డ్రా చేయకూడదని నిర్ణయించాం. ఈ మేరకు పింఛనుదారులకు విన్నవిస్తున్నాం.’
- ఈదర వీరయ్య, రాష్ట్ర పింఛనుదారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అదరగొట్టిన హైదరాబాద్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్పై విజయం
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!