Supreme Court: సుదీర్ఘ కాలం సస్పెన్షన్ చెల్లదు
అనుచిత ప్రవర్తన పేరుతో చట్టసభల నుంచి సభ్యులను సుదీర్ఘ కాలం పాటు సస్పెండ్ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారిపై విధించే చర్య ఆ సమావేశం(సెషన్) వరకే పరిమితం కావాలని
చట్టసభల్లో దుష్ప్రవర్తనపై చర్య.. ఆ సెషన్ వరకే
మహారాష్ట్రలో 12 మంది భాజపా ఎమ్మెల్యేల ఏడాది సస్పెన్షన్పై సుప్రీం తీర్పు
దిల్లీ: అనుచిత ప్రవర్తన పేరుతో చట్టసభల నుంచి సభ్యులను సుదీర్ఘ కాలం పాటు సస్పెండ్ చేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారిపై విధించే చర్య ఆ సమావేశం(సెషన్) వరకే పరిమితం కావాలని తెలిపింది. సస్పెన్షన్ కాల వ్యవధి.. కొనసాగుతున్న సమావేశం పరిధిని మించితే దాని ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తంపై పడుతుందని అభిప్రాయపడింది. విపక్ష సభ్యుల సంఖ్యను అప్రజాస్వామిక పద్ధతుల్లో తగ్గించడం అంటే స్వల్ప మెజార్టీ ఉన్న ప్రభుత్వ మనుగడకు అవకాశం కల్పించినట్లేనని పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ 12 మంది భాజపా ఎమ్మెల్యేలు దాఖలు చేసుకున్న పిటిషన్పై ఇచ్చిన తీర్పులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. శాసనసభ్యుల ఏడాది పాటు సస్పెన్షన్ ... బహిష్కరణ, సభ్యత్వ రద్దు, రాజీనామా కన్నా దారుణమైన చర్యగా జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సి.టి.రవికుమార్ల ధర్మాసనం పేర్కొంది. ‘‘12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చట్టరీత్యా చెల్లదని ప్రకటిస్తున్నాం. 2021 జులైలో వర్షాకాల సమావేశాల్లో చేసిన ఆ తీర్మానంలో పేర్కొన్న సస్పెన్షన్ కాల వ్యవధి ఆ సెషన్ కాల పరిమితిని మించి ఉండడం రాజ్యాంగ వ్యతిరేకం. చట్టవిరుద్ధం. నిర్హేతుకం’’ అని పేర్కొంటూ 90 పేజీల తీర్పును వెలువరించింది. శాసనసభ సభ్యులుగా వారికి లభించే ప్రయోజనాలన్నీ సస్పెన్షన్ కాల వ్యవధిలోనూ పొందటానికి అర్హులుగా పేర్కొంది. సభ్యులపై చర్య తీసుకోవడానికి చట్టసభకు అధికారం ఉన్నప్పటికీ..దానిని సక్రమంగా, క్రమపద్ధతిలో, అంచలంచలుగా వినియోగించాలని స్పష్టం చేసింది. సభ్యులను సుదీర్ఘ కాలంపాటు సస్పెండ్ చేస్తూ వెళ్తే విపక్షం సభలో జరిగే చర్చల్లో ప్రభావవంతంగా పాల్గొనలేదని పేర్కొంది. అటువంటి చర్చలకు అర్థం ఉండదని తెలిపింది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన అదుపు తప్పుతున్న పరిస్థితులు తరచూ ఎదురవుతున్నాయి. అయితే వారిపై తీసుకునే చర్యలు రాజ్యాంగబద్ధంగా, చట్టప్రకారం, సహేతుకంగా, నియమ నిబంధనల ప్రకారం ఉండాల్సిందేనని విస్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారితో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ 2021 జులై5న.. 12 మంది భాజపా ఎమ్మెల్యేలను సభ నుంచి ఏడాది పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. దీనిని సవాల్చేస్తూ భాజపా శాసనసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, మహారాష్ట్రలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ హర్షం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?