AP PRC: ఇది చీకటి ఒప్పందం.. ఆందోళన కొనసాగిస్తాం: ఏపీటీఎఫ్‌

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపినా... డిమాండ్లను సాధించుకోవడంలో విఫలమయ్యామని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన

Updated : 10 Aug 2022 15:15 IST

ఈనాడు, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఆందోళన ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపినా... డిమాండ్లను సాధించుకోవడంలో విఫలమయ్యామని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావులు శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల్లో సఫలమైంది ప్రభుత్వమేనని, తాము విఫలమయ్యామని తెలిపారు. ఇది చీకటి ఒప్పందమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తమతో కలిసొచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. వారు ప్రకటనలోపేర్కొన్న అంశాలు..

* చర్చల్లో సీపీఎస్‌ రద్దుపై ఎలాంటి నిర్ణయమూ జరగలేదు.

* హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు పునరుద్దరించుకోలేకపోయాం. ఈ విషయంలో గ్రామీణ ప్రాంత ఉద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.

* వృద్ధులకు పాత అదనపు పింఛను సాధించుకోలేకపోయాం

* ఐఆర్‌ ఇచ్చిన తేదీ నుంచి మానిటరీ బెనిఫిట్‌ ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చ జరగనే లేదు

* కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదు

* 11వ పీఆర్‌సీ నివేదికను చూడలేకపోయాం

* ప్రధాన డిమాండైన ఫిట్‌మెంట్‌ని 27శాతానికి పెంచుకోలేకపోయాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని