Gautam Sawang:ఏపీపీఎస్సీ ఛైర్మన్గా గౌతమ్ సవాంగ్?
డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించనున్నట్టు తెలిసింది. ఆ పోస్టులో చేరేందుకు సవాంగ్ కూడా
ఐపీఎస్కి రాజీనామా చేసి చేరాల్సిందే
ఈనాడు, అమరావతి, ఒంగోలు నేర విభాగం, న్యూస్టుడే: డీజీపీ పోస్టు నుంచి బదిలీ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించనున్నట్టు తెలిసింది. ఆ పోస్టులో చేరేందుకు సవాంగ్ కూడా సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఏపీపీఎస్సీ ఛైర్మన్ రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో... సర్వీసులో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ పోస్టులో చేరాలంటే సర్వీసుకు రాజీనామా చేయాలి. సవాంగ్ ఐపీఎస్కి రాజీనామా చేశాకే... ఏపీపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టాలి. సవాంగ్ పదవీ విరమణకు 2023 జులై వరకు గడువు ఉంది. అంటే ఇంకా 17 నెలలకుపైగా సర్వీసు ఉంది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా ఆరేళ్లు గానీ, 62 ఏళ్ల వయసు వరకు గానీ కొనసాగవచ్చు. ఐపీఎస్కి రాజీనామా ప్రక్రియ పూర్తి చేసుకుని ఆయన ఏపీపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పోస్టులో ఆయన మూడున్నరేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది.
సవాంగ్కు లేని బాధ వాళ్లకెందుకో: మంత్రి బాలినేని
‘రాష్ట్ర డీజీపీగా గౌతమ్ సవాంగ్ రెండున్నరేళ్లు పనిచేశారు. అంత కాలం పనిచేసిన ఏ అధికారినైనా బదిలీ చేయడం సహజం. ఆయన బాగానే ఉన్నారు.. మధ్యలో వీళ్లకొచ్చిన బాధేంటో’ అని ప్రతిపక్షాలను ఉద్దేశించి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఒంగోలులో గురువారం విలేకర్లతో మాట్లాడారు. సవాంగ్కు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అన్యాయం చేయలేదన్నారు. ఆయనను అత్యంత కీలకమైన ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించనుందని తెలిపారు. ‘ఆయన బాగానే ఉన్నారు. సీఎంను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతల్నీ సంతోషంగా స్వీకరించబోతున్నారు. మధ్యలో వీళ్లకేంటో బాధ’ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగ జీవితంలో బదిలీలు అత్యంత సర్వసాధారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలతో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు 9 గంటలపాటు పగటి పూటే ఉచిత విద్యుత్తును ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్