నా సస్పెన్షన్ ఎత్తివేత జీవో అసంపూర్ణం
తన సస్పెన్షన్ ఎత్తేస్తూ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో అసంపూర్ణంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. 2020
న్యాయస్థానాల ఆదేశాల్ని సరిగ్గా చదవలేదా?
ఐఏఎస్లకు ఒక న్యాయం.. మాకో న్యాయమా?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
ఈనాడు, అమరావతి: తన సస్పెన్షన్ ఎత్తేస్తూ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో అసంపూర్ణంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. 2020 ఫిబ్రవరి 8వ తేదీ నుంచే సస్పెన్షన్ ఎత్తివేత వర్తింపజేయాల్సి ఉన్నప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, ఇది సరికాదని చెప్పారు. అధికారులు న్యాయస్థానాల ఆదేశాల్ని సరిగ్గా చదవలేదా? లేకుంటే న్యాయాభిప్రాయమే అలా వచ్చిందా? అనేది తనకు తెలియదని వివరించారు. ‘మీరిచ్చిన ఆదేశాలు అసంపూర్ణంగా ఉన్నాయి. వాటిని సరిచేయండి. లేకుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పదు’ అనే విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయనను కలవాలనుకున్నానని, సీఎస్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నప్పటికీ తనను కలవటానికి ఇష్టపడలేదని వివరించారు. ప్రతి అంశం అమలు కోసం కోర్టును ఆశ్రయించాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయని తెలిపారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘సీఎస్ సమీర్ శర్మను కలిసి జాయినింగ్ రిపోర్టు ఇవ్వటానికి వెళ్లాను. ఆ రిపోర్టు తీసుకుని పంపించేయాలంటూ సీఎస్ చెప్పారని ఆయన పీఏ తెలిపారు. సివిల్ సర్వీసెస్ సంప్రదాయం ప్రకారం జూనియర్ అధికారులకు సీనియర్లు రిపోర్టు చేయరు. అందుకే సీఎస్ను కలవాలనుకున్నా. సీఎస్ పదవీ విరమణ వయసు అయిపోయి పొడిగింపుపై కొనసాగుతున్నారు. నాకు ఇంకా రెండేళ్లు సర్వీసు ఉంది. నేనూ ఆయనలాగే అదే యూపీఎస్సీ పరీక్ష రాసే వచ్చాను కదా! నాలాగే పోస్టింగు ఇవ్వకుండా వీఆర్లో ఉంచిన కొందరు ఐఏఎస్ అధికారులకు మాత్రం జీతాలు ఇచ్చారు. నాకు మాత్రం ఏడు నెలల పాటు ఇవ్వలేదు. చివరికి కోర్టును ఆశ్రయిస్తే తప్ప నాకు జీతం ఇవ్వలేదు. ఐఏఎస్లకు ఓ న్యాయం, మాకో న్యాయమా?
సంవత్సరాల తరబడి వీఆర్లో పెట్టారు..
కానిస్టేబుల్ నుంచి ఎస్పీ ర్యాంకు అధికారుల వరకూ చాలామందిని సంవత్సరాల తరబడి వీఆర్లో పెట్టారు. తర్వాత పోస్టింగు ఇచ్చినా వీఆర్లో ఉన్న కాలానికి జీతాలు ఇవ్వలేదు. తాము ఫలానా కులానికి చెందిన వాళ్లం కాబట్టి వీఆర్లో పెట్టారని కొందరు, అప్పట్లో నిఘా విభాగంలో పని చేసినందున పక్కన పెట్టారని మరికొందరు.. మీ దగ్గర పని చేశామని మీకు బాగా దగ్గరగా ఉన్నామనే కారణంతో తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ మరికొందరు నాతో చెప్పి వాపోయారు. నిజంగా వారు తప్పు చేస్తే శిక్షించండి. అంతే తప్ప వేతనంపైనే బతికే ఉద్యోగులకు రెండేళ్లపాటు జీతం ఇవ్వకపోతే వారు ఎలా బతుకుతారు? ఇవన్నీ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా.
మూడేళ్లుగా అధికారంలో ఉన్నారు.. ఏం పీకారు?
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల నాపై కొన్ని ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా వారే అధికారంలో ఉన్నారు కదా! ఏం పీకారు? సుప్రీం కోర్టు ఆదేశిస్తే తప్ప నాపై ఏడాదిన్నర పాటు కనీసం అభియోగపత్రం నమోదు చేయలేకపోయారు. అందులోని అంశాలేవి నిరూపించలేకపోయారు. ఇప్పటికే మూడేళ్లు అయిపోయింది. నాపై చేసిన ఆరోపణల వ్యవహారాన్ని ఇప్పటికైనా త్వరగా తేల్చండి. గతంలో ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యంపై దాడి వ్యవహారంలో కేసు నమోదు చేయాలనే నేను పట్టుబట్టా. అప్పట్లో విజయవాడ సీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కేసు ఎందుకు నమోదు చేయలేదో ఆయన్నే సజ్జల అడగాలి. కనీసం ఆయన డీజీపీ అయ్యాకైనా సరే ఎందుకు కేసు నమోదు చేయలేకపోయారో సమాధానం చెప్పాలి. నేను నిఘా విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో నా దృష్టికి వచ్చిన అనేక అంశాల్లో అమానవీయ పనులు చేయొద్దనే పోలీసులకు చెప్పేవాణ్ని. దీంతో అప్పటి ప్రతిపక్షానికి కొమ్ముకాస్తున్నానంటూ నాపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను ఏదైనా అనే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి.
2020 ఫిబ్రవరి 8 నుంచి వేతనాలు, భత్యాలు చెల్లించాలి
హైకోర్టు ఆదేశాల మేరకు 2020 ఫిబ్రవరి 8 నుంచి ఇప్పటివరకూ పూర్తి వేతనాలు, భత్యాలు చెల్లించాలి. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాను. నేను జాయినింగ్ రిపోర్టు ఇచ్చేశాను. పోస్టింగ్ ఇస్తారా.. ఇవ్వరా అనేది ప్రభుత్వ ఇష్టం. నాకు పోస్టింగు ఇవ్వకపోతే ప్రజాధనం వృథా అయినట్లే. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి నా అక్రమ సస్పెన్షన్కు కారణమైన అధికారులు, అధికారేతరుల నుంచి కోర్టు ఖర్చులు వసూలు చేయాలని సీఎస్కు లేఖ రాశాను.
తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై దావా
ఎన్నికల సంఘానికి నాపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేసిన ఘటనలో పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వం అనుమతి కోరాను. నిర్దేశిత కాలపరిమితి దాటిపోయినందున ఆ అనుమతి లభించినట్టే లెక్క. ఈ వ్యవహారంలో కొంతమందికి నోటీసులు కూడా పంపించాను’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.