అట్టహాసంగా ద్రౌపది నామినేషన్
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్సెల్వం, యూపీ, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, మనోహర్ లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మై, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఆమె వెంట వచ్చారు.
16వ రాష్ట్రపతి ఎన్నికకు పత్రాల సమర్పణ
ప్రతిపాదించిన ప్రధాని మోదీ
బలపరిచిన కేంద్ర మంత్రులు
రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఏఐఏడీఎంకే నేత పన్నీర్సెల్వం, యూపీ, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, మనోహర్ లాల్ ఖట్టర్, బసవరాజ్ బొమ్మై, శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ఆమె వెంట వచ్చారు.
ఈనాడు, దిల్లీ: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం 12.39 గంటలకు ప్రధాని చేతుల మీదుగా ఆమె తన పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి.మోదీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికను కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నామినేషన్ల సమయంలోనే ప్రత్యర్థులకు తన సంఖ్యాబలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రాంగణం సందడిగా మారింది.
దిల్లీలోని ఒడిశా భవన్లో బస చేసిన ద్రౌపది.. ఉదయం అక్కడి నుంచి పార్లమెంటుకు బయలుదేరడానికి ముందు ప్రతిపక్ష నేతలు సోనియా గాంధీ, మమతా బెనర్జీ, శరద్ పవార్లకు ఫోన్చేసి తనకు మద్దతు ఇవ్వాలని, నామినేషన్ కార్యక్రమంలోనూ పాలుపంచుకోవాలని కోరారు. అనంతరం పార్లమెంటు లైబ్రరీ భవనానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఇతర ముఖ్యనేతలు వెంట వచ్చారు. అప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సిద్ధం చేసి ఉంచారు. వీటిపై ప్రతిపాదకులు, సమర్థకులతో కలిసి 500 మందికిపైగా ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.
* మొదటి సెట్పై ప్రధానమంత్రి తొలి సంతకం చేసి ఆమె పేరును ప్రతిపాదించగా, రాజ్నాథ్ సింగ్ రెండో సంతకం చేసి బలపరిచారు. తర్వాత కేంద్ర మంత్రులంతా ప్రతిపాదకులు, సమర్థకుల జాబితాలో సంతకాలు చేశారు.
* రెండో సెట్లో భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తొలి సంతకం చేయగా, భాజపా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు.
* మూడో సెట్పై హరియాణా, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రులు తొలి, మలి సంతకాలు చేయగా, ఆ రాష్ట్రాల ఎంపీలు, శాసనసభ్యులు మిగతా సంతకాలు చేశారు.
* నాలుగో సెట్పై గుజరాత్ సీఎం, ఆ రాష్ట్రానికి చెందినఎంపీలు, ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్యాహ్నం 12.09 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనానికి వచ్చి ద్రౌపదితో భేటీ అయ్యారు. 12.30 గంటలకు అందరూ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి, నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేడీ, జేడీయూ, అన్నా డీఎంకే, వైకాపా నేతలు పాలుపంచుకున్నారు. జులై 18లోపు ఓటర్లందర్నీ కలిసి మద్దతు కోరుతానని ద్రౌపది ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వైకాపా నేతల సంతకాలు
నామినేషన్ పత్రాలపై వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి, లోక్సభ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంతకాలు చేశారు. నామినేషన్ ర్యాలీలో వీరితోపాటు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు పాలుపంచుకున్నారు.
* ద్రౌపదీ ముర్ము నామినేషన్ కార్యక్రమానికి ఏన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తర్ప్రదేశ్), శివరాజ్సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), బసవరాజ్ బొమ్మై (కర్ణాటక), భూపేంద్ర పటేల్ (గుజరాత్), హిమంత బిశ్వశర్మ (అస్సాం), పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్), జయరాం ఠాకూర్ (హిమాచల్ప్రదేశ్), మనోహర్లాల్ కట్టర్ (హరియాణా), పెమా ఖండూ (అరుణాచల్ ప్రదేశ్), ప్రమోద్ సావంత్ (గోవా), బీరేన్ సింగ్ (మణిపుర్), కర్నాడ్ సంగ్మా (మేఘాలయ)లు నామపత్రాలపై సంతకాలు చేశారు.
60%కిపైగా ఓట్లు వస్తాయని ధీమా
రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు 60%కిపైగా ఓట్లు వస్తాయని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు, బయటినుంచి బీజేడీ, వైకాపా, ఇతర పార్టీలూ మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని దాటడం ఖాయమన్నారు. దేశంలో తొలిసారి గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి పోటీకి నిలబెట్టిన నేపథ్యంలో బలహీనవర్గాల ఎంపీలూ ఆమెకు మద్దతిచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ముర్ముకు నివాస గృహం కేటాయింపు
ద్రౌపదీ ముర్ముకు తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం దిల్లీలోని పండిత్ ఉమాశంకర్ దీక్షిత్ మార్గ్లోని 4వ నెంబర్ ఇల్లు కేటాయించింది. ప్రస్తుతం ఒడిశా భవన్లో ఉంటున్న ఆమె ఎన్నికయ్యేంతవరకూ ఈ ఇంట్లో ఉండటానికి అవకాశం కల్పించారు. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా.. అదే నెల 21న ఫలితం వెలువడనుంది. ముర్ముకు మద్దతివ్వాలంటూ భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం విపక్ష పార్టీలకు చెందిన మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌధురి, మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తదితరులకు ఫోన్లో విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?