NTR Daughter: ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం
దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె జూబ్లీహిల్స్ రోడ్ నంబర్
చిన్న కుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణం
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-జూబ్లీహిల్స్, ఉస్మానియా ఆసుపత్రి: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లో భర్త శ్రీనివాస్ ప్రసాద్, చిన్నకుమార్తె దీక్షిత, అల్లుడు రాహుల్ చౌదరితో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె విశాల, ఆమె భర్త అమెరికాలో ఉంటున్నారు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉమామహేశ్వరి.. కుమార్తె, అల్లుడితో కొద్దిసేపు మాట్లాడారు. 10 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కుమార్తె భోజనానికి పిలవగా ఎంతకూ తలుపు తీయలేదు. కుమార్తె, అల్లుడు తలుపు గట్టిగా కొట్టడంతో గడియ ఊడిపోయింది. లోపల ఉమామహేశ్వరి ఫ్యాన్కు చున్నీతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. కిందకు దించి పరిశీలించగా.. అప్పటికే ఆమె మృతి చెంది ఉన్నారు. ఘటన సమయంలో ఇంట్లో కుమార్తె, అల్లుడితో పాటు ఆడపడుచు నిరుపమ, పనిమనిషి ఉన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి వివరాలు సేకరించారు. అనారోగ్యంతో పాటు ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుమార్తె దీక్షిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఉమామహేశ్వరి కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు నేత్రాలను సేకరించారు. వ్యాపార రీత్యా ఏపీలోని అనంతపురం జిల్లాకు వెళ్లిన శ్రీనివాస ప్రసాద్.. భార్య మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఉమామహేశ్వరి రెండో కుమార్తె దీక్షిత వివాహం మూడు నెలల క్రితమే జరిగింది. ఇంతలోనే తల్లి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఉమామహేశ్వరి పార్థివదేహానికి సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలతో పాటు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, సోదరి భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, నందమూరి సుహాసిని, కల్యాణ్రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, తెదేపా తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త కంభంపాటి రాంమోహన్రావు, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తదితరులు నివాళి అర్పించారు.
ఇటీవలే ఆనందంగా గడిపాం.. ఇంతలోనే విషాదం: చంద్రబాబు
ఉమామహేశ్వరి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇటీవలే కుటుంబ సభ్యులందరం కలుసుకొని ఆనందంగా గడిపాం. ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి రావడం దురదృష్టకరం. ఎన్టీఆర్ క్రమశిక్షణను పుణికిపుచ్చుకున్న ఉమామహేశ్వరి ఎంతో హుందాగా, శాంతంగా ఉండేవారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
‘చిన్నమ్మ మృతి బాధాకరం’
ఈనాడు డిజిటల్, అమరావతి: చిన్నమ్మ కంఠమనేని ఉమామహేశ్వరి ఇక లేరనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘ఆమె మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. కుటుంబంలో ఏ శుభకార్యమైనా చిన్నమ్మ దగ్గరుండి జరిపించేవారు’’ అని లోకేశ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?