కరెంటు.. నెలకో రేటు?
విద్యుత్ వినియోగానికి యూనిట్వారీగా విధించే ఛార్జీలు నెల నెలా మారే అవకాశముందా? కొత్త నియమావళిపై ఉత్తర్వులు జారీ అయితే కొద్దిరోజుల్లోనే ఈ విధానం అమలులోకి రానుంది. ఖర్చులను బట్టి ప్రజల నుంచి ఛార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను
ఖర్చును బట్టి ఛార్జీలు సవరించుకునే స్వేచ్ఛ డిస్కంలకు..
ఇంతకాలం ఈఆర్సీ ఆదేశాలుంటేనే పెంపు
విద్యుత్ చట్ట నియమావళికి సవరణ ముసాయిదా జారీ
బిల్లు ఆగిపోవడంతో దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
ఉత్తర్వులు జారీ అయితే అమల్లోకి రానున్న కొత్త విధానం
ఈనాడు - హైదరాబాద్
విద్యుత్ వినియోగానికి యూనిట్వారీగా విధించే ఛార్జీలు నెల నెలా మారే అవకాశముందా? కొత్త నియమావళిపై ఉత్తర్వులు జారీ అయితే కొద్దిరోజుల్లోనే ఈ విధానం అమలులోకి రానుంది. ఖర్చులను బట్టి ప్రజల నుంచి ఛార్జీలను వసూలు చేసుకునే స్వేచ్ఛను పూర్తిగా ‘విద్యుత్ పంపిణీ సంస్థ’(డిస్కం)లకే కట్టబెడుతూ కేంద్ర విద్యుత్ చట్ట నియమావళికి సవరణలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కరెంటు కొనుగోలు, ఇతర ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త విధానంతో నెలనెలా ఛార్జీలు పెరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త నియమావళి ముసాయిదా (డ్రాఫ్ట్)ను శుక్రవారం అన్ని రాష్ట్రాల విద్యుత్శాఖలు, విద్యుత్ సంస్థలకు కేంద్రం పంపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలున్నా లేదా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే సెప్టెంబరు 11లోగా మెయిల్ ద్వారా తెలపాలని సూచించింది.
విద్యుత్ చట్టాన్ని సవరించేందుకు బిల్లు తయారుచేసి పార్లమెంటులో ప్రవేశపెట్టగా దాన్ని ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో సభాపతి సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ఇక ఇప్పట్లో బయటికి వస్తుందో రాదోనన్న అనుమానంతో విద్యుత్ చట్టం-2003లోని నియమావళికి సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్శాఖ దొడ్డిదారిన తాజా ముసాయిదాను పంపింది. అభ్యంతరాలకు సెప్టెంబరు 11 దాకా గడువు ఇచ్చినందున అక్టోబరులో తుది ఉత్తర్వులు జారీఅయ్యే అవకాశాలున్నాయని అంచనా.
ముసాయిదాలో ఏముందంటే...
* ఇంతకాలం కరెంటు ఛార్జీలను పెంచాలంటే ఏడాదికోమారు డిస్కంలు ఆదాయ, వ్యయాల నివేదికలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కివ్వాలి. వాటిని పరిశీలించి ఏడాదికోమారు ఛార్జీల సవరణకు మండలి ఆదేశాలిస్తోంది. కానీ ఇకనుంచి ఖర్చులను ఎప్పటికప్పుడు లెక్క చూసుకుని ఆ మేరకు కరెంటు ఛార్జీలను ప్రజల నుంచి డిస్కంలు వసూలు చేసుకోవచ్చని ముసాయిదాలో ప్రతిపాదించారు.
* విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి, బహిరంగ మార్కెట్లో ఇంధన ఎక్స్ఛేంజీ నుంచి కరెంటును డిస్కంలు కొంటాయి. యూనిట్కు గరిష్ఠంగా రూ.12 వరకూ చెల్లించి కరెంటును రోజూ కొనాల్సి వస్తున్నందున నష్టాలు వస్తున్నాయని డిస్కంలు చెబుతున్నాయి. ఏటా ఒకసారి ఈఆర్సీ ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూడటం వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమలైతే నెలనెలా ఛార్జీలు పెరుగుతాయనే తెలుస్తోంది. ఇలా వసూలుచేసిన ఛార్జీల లెక్కలను ఏడాదికోసారి ఈఆర్సీకి నివేదించి హెచ్చుతగ్గులుంటే మరుసటి ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి ఛార్జీలను సవరించేందుకు ఈఆర్సీ తుది ఆదేశాలిస్తుంది.
సంప్రదాయేతర ఇంధనానికిక ఏకీకృత ధరలు
కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యుత్కేంద్రాల నుంచి వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేసే ‘సంప్రదాయేతర ఇంధనానికి’ (రెన్యూవబుల్ ఎనర్జీ-ఆర్ఈ) ఏకీకృత ఇంధన విక్రయ ధరలను నెలవారీగా నిర్ణయించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నియమావళికి సవరణ ముసాయిదాలో మరో ప్రతిపాదన చేసింది. జల, సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధనాన్ని వేర్వేరు రాష్ట్రాలకు సరఫరా చేస్తుంటే ఏకీకృత సగటు విక్రయధరను నిర్ణయించాలని తెలిపింది. దీనిని ఆధారం చేసుకుని ఆర్ఈ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే కరెంటు కొనుగోలు ధరలను నిర్ణయిస్తారు.
* సంప్రదాయేతర ఇంధనాన్ని ఉత్పత్తి చేసిన తరవాత నిల్వ చేసుకునే అవకాశాన్ని అందరికీ కల్పిస్తూ మరో ప్రతిపాదన చేసింది. డిస్కం గానీ, జెన్కో లేదా ట్రాన్స్కో లేదా ఏ ఇతర కంపెనీ అయినా ఆర్ఈని నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చు. ఈ ప్రతిపాదన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో ఉంది. బిల్లు పార్లమెంటులో ఆగిపోవడంతో ఇలా నియమావళి సవరణ ప్రతిపాదనల్లో పెట్టి అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని రాష్ట్ర సీనియర్ విద్యుత్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం