తొందరపాటు చర్యలు తీసుకోరని భావిస్తున్నాం

అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు ఠాణాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(ఉపా) కింద పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, ప్రగతిశీల కార్మిక సంఘం బాధ్యులు ఎ.అన్నపూర్ణపై

Published : 18 Aug 2022 04:51 IST

పోలీసులకు స్పష్టం చేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు ఠాణాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(ఉపా) కింద పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, ప్రగతిశీల కార్మిక సంఘం బాధ్యులు ఎ.అన్నపూర్ణపై నమోదు చేసిన కేసు విషయంలో పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోరని భావిస్తున్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యాజ్యాలపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు బుధవారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు. ఉపా చట్టం కింద తమపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చిలుకా చంద్రశేఖర్‌, అన్నపూర్ణ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్ల అరెస్ట్‌ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు విచారణ ఈనెల 22కు వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని