వర్సిటీల నిధులపై సర్కారు కన్ను!
‘విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లోనూ ఫీజు రీయింబర్స్ చేస్తాం. అవి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందుతాయి’
రూ.2,000 కోట్లు తీసుకునేందుకు వివరాల సేకరణ
ఇప్పటికే రూ.150 కోట్లు ఎస్ఎఫ్ఎస్సీలో డిపాజిట్
‘విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రభుత్వ కళాశాలల్లోనూ ఫీజు రీయింబర్స్ చేస్తాం. అవి ఆర్థికంగా స్వయం సమృద్ధి చెందుతాయి’
- 2021 అక్టోబరు 25న ఉన్నత విద్య సమీక్షలో సీఎం జగన్
వాస్తవం: తాము ఇచ్చిన వాటితోపాటు, పిల్లలు చెల్లించిన ఫీజుల డబ్బులనూ ప్రభుత్వమే లాగేసుకుంటోంది. రాష్ట్ర ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్ అని చెబుతున్నా ప్రభుత్వం వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు. నిధులు లేకపోతే విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏంటి?
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల నిధులను ఇతర కార్యకలాపాలకు మళ్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఒకసారి వర్సిటీల నుంచి రూ.150 కోట్లను రాష్ట్ర ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో (ఎస్ఎఫ్ఎస్సీ) డిపాజిట్ చేయించుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరోమారు నిధులపై దృష్టి పెట్టింది. అన్ని విశ్వవిద్యాలయాల నుంచి రూ.2వేల కోట్లను మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశ్వవిద్యాలయాల ప్రొఫైల్ పేరుతో ఉన్నత విద్యా మండలి ద్వారా ఆర్థిక వివరాలను సేకరిస్తోంది. కార్పొరేషన్లో డిపాజిట్ చేస్తే అవి వెనక్కి వచ్చే పరిస్థితి లేదని ఇప్పటికే వర్సిటీలు గగ్గోలు పెడుతున్నాయి. మీ వర్సిటీలో ఎంత మంది పని చేస్తున్నారు? ఎంతమంది పింఛనర్లు ఉన్నారు? ఏడాదికి జీతాలు, పింఛన్లకు ఎంత చెల్లిస్తున్నారు? మీ ఆదాయ వనరులేంటి? ఇప్పటివరకు ఎంత నిల్వ ఉంది? ఏయే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు? కాలపరిమితి ఎప్పటికి పూర్తవుతుంది? అంతర్గత ఆదాయవనరులతో చేస్తున్న అభివృద్ధి కార్యకలాపాలేంటి? అనే వివరాలను అందించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది.
పదవీ విరమణ ప్రయోజనాలకూ కష్టమే
విశ్వవిద్యాలయాలు, బోర్డులలోని నిధులను కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని గతంలో ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో కొంత మొత్తం డిపాజిట్ చేశారు. అంతా డిపాజిట్ చేస్తే వెనక్కి రావని కొన్నింటిని అట్టిపెట్టుకున్నారు. ఇప్పుడు వాటినీ లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో పింఛన్లు, జీతభత్యాలకు ప్రభుత్వం ఇస్తున్న బడ్జెట్ సరిపోకపోవడంతో సొంత నిధులను ఖర్చుచేస్తున్నాయి. పిల్లల ఫీజుల డబ్బులనూ వదలడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పదవీవిరమణ చేస్తున్న ఉద్యోగులకు మూడేళ్లుగా ప్రయోజనాలను అందించట్లేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నిధులనూ తీసేసుకుంటే భవిష్యత్తులో ఈ వర్సిటీ పరిస్థితి ఏంటి? రూ.40 కోట్లు పదవీవిరమణకు చెల్లించాల్సి ఉంది.
* ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పింఛనర్లు సుమారు 4వేల మంది ఉన్నారు. వీరికి చెల్లించేందుకు ఏడాదికి రూ.210కోట్లు కావాలి. ప్రభుత్వం అన్నింటికీ కలిపి రూ.200కోట్లు ఇస్తోంది. దీంతో విశ్వవిద్యాలయానికి ఫీజులు, ఇతర ఆదాయం నుంచి ఏటా రూ.100కోట్లు ఖర్చుచేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల నిధులు కలిపి సుమారు రూ.400కోట్లు ఉన్నాయి. ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బంది పదవీవిరమణ పొందితే విశ్వవిద్యాలయం నిధుల నుంచి చెల్లిస్తున్నారు.
* జేఎన్టీయూ అనంతపురం ఇప్పటికే కార్పొరేషన్లో రూ.50కోట్లు డిపాజిట్ చేసింది. వర్సిటీ కార్యకలాపాలు, పదవీవిరమణ ప్రయోజనాలు, నిర్వహణకు రూ.400కోట్ల వరకు ఉంచుకున్నారు. నిధుల కోసం ప్రభుత్వం వర్సిటీపై ఒత్తిడి తీసుకొస్తే భవిష్యత్తు కార్యకలాపాలను నిలిపివేయాలి. జేఎన్టీయూ కాకినాడ మొదటివిడతగా రూ.70కోట్లు డిపాజిట్ చేసింది. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో దీనికి ఆదాయం ఎక్కువ. ఇక్కడ సుమారు రూ.450కోట్ల వరకు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?