‘గాలి’ కేసులో రోజువారీ విచారణ
‘గాలి జనార్దన్రెడ్డి కేసు విచారణ రోజువారీ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నాం. కేసు పురోగతిని జనవరిలో సమీక్షించాలనుకుంటున్నాం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం’
జనవరిలో పురోగతిని సమీక్షిస్తాం
సూచనప్రాయంగా వెల్లడించిన సుప్రీంకోర్టు
బళ్లారికి వెళ్లడానికి అనుమతివ్వద్దని సీబీఐ వాదనలు
షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు కోరుతూ పిటిషిన్ వేయలేదే అన్న ధర్మాసనం
ఈనాడు, దిల్లీ: ‘గాలి జనార్దన్రెడ్డి కేసు విచారణ రోజువారీ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని భావిస్తున్నాం. కేసు పురోగతిని జనవరిలో సమీక్షించాలనుకుంటున్నాం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం’ అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కడప, అనంతపురం, బళ్లారి వెళ్లకుండా ఉండాలనే తన బెయిల్ షరతులు సడలించాలంటూ గాలి జనార్దన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మాధవి దివాన్ వాదనలు వినిపించారు. ‘గాలి జనార్దన్రెడ్డి బెయిల్ షరతులను ఎట్టి పరిస్థితుల్లోనూ సడలించవద్దు. ఈ అంశంలో ఆయనపై తీవ్రమైన అభియోగాలున్నాయి. ఓ న్యాయమూర్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెయిల్ కోసం రూ.40 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారు. బెయిల్ సమయంలో పెట్టిన షరతులన్నింటినీ ఆయన ఉల్లంఘించారు’ అని తెలిపారు. గాలి తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదనలు వినిపించారు. ‘జనార్దన్రెడ్డికి షరతులతో బెయిల్ ఇవ్వడానికి సీబీఐ గతంలో ఎటువంటి అభ్యంతరం పెట్టలేదు. ఆరేళ్లపాటు బెయిల్పై ఉన్న ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో 26సార్లు బళ్లారి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. అప్పుడు కోర్టు విధించిన షరతులను జనార్దన్రెడ్డి ఉల్లంఘించలేదు. అయినప్పటికీ షరతుల సడలింపునకు సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆయన కుటుంబం అంతా బళ్లారిలోనే ఉంటున్నా అక్కడికి వెళ్లేందుకు అనుమతివ్వడం లేదు. ట్రయల్ కోర్టులో జనార్దన్రెడ్డి డిశ్చార్జి పిటిషన్ పెండింగ్లో ఉంది. 300 మంది సాక్షుల్లో కేవలం 20 మందే బళ్లారిలో ఉన్నారు. అయినా వారిని ప్రభావితం చేస్తారని సీబీఐ వాదిస్తోంది. ఈ కేసులో వంద మందికి పైగా సాక్షులు బెంగళూర్, హైదరాబాద్ల్లో ఉంటున్నారు. అక్కడ అభ్యంతర పెట్టని సీబీఐ బళ్లారి విషయంలో వ్యతిరేకంగా వాదిస్తోంది’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
విచారణ ఆలస్యానికి కారణమెవరు?
ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ ఎం.ఆర్.షా ట్రయల్ కోర్టులో విచారణ ఆలస్యానికి కారణం ఎవరు? నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జి పిటిషన్లు వేయడం, స్టేలు కోరడం కాదా అని ప్రశ్నించారు. మైనింగ్ వ్యవహారానికి సంబంధించి కర్ణాటకలో అయిదు కేసుల విచారణ వేగంగా సాగుతోందని, హైదరాబాద్లో విచారణ పదకొండేళ్లుగా పురోగతి లేదని గాలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇతర నిందితులు డిశ్చార్జి పిటిషన్లు ఇక్కడ ఆలస్యానికి కారణం కావచ్చన్నారు. ఏఎస్జీ మాధవి దివాన్ స్పందిస్తూ ‘బళ్లారి, అనంతపురం, కడప వెళ్లకూడదనే షరతులతోనే 2015లో గాలి జనార్దన్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ నాటి తీర్పులోని షరతులన్నింటిని ఆయన ఉల్లంఘించారు’ అని విన్నవించారు. షరతులు ఉల్లంఘించినప్పుడు బెయిల్ రద్దు చేయాలని ఎందుకు పిటిషన్ వేయలేదు? మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? అసలు మీరు (సీబీఐ) ఈ విషయంలో సీరియస్గా ఉన్నారా అని సీబీఐ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. తాను 2021 నుంచి ఈ కేసులో వాదిస్తున్నానని, షరతులు ఎత్తివేయాలని వారు పిటిషన్ వేసినప్పటి నుంచి తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని మాధవి దివాన్ ధర్మాసనానికి తెలిపారు. అధికారులు సీరియస్గానే ఉన్నారని విన్నవించారు. విచారణ వేగవంతమయ్యేందుకు జనార్దన్రెడ్డి సహకరించలేదని, సహ నిందితులు విచారణకు గైర్హాజరవుతున్నారని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఈ కేసులో విచారణ రోజువారీ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు.
ఆయన కుమార్తె ప్రసవించింది.. బళ్లారి వెళ్లనివ్వండి
గాలి జనార్దన్రెడ్డి కుమార్తె రెండు రోజుల క్రితం ప్రసవించిందని, ఆయన నాలుగు వారాలు బళ్లారిలో ఉండేందుకు అనుమతివ్వాలని మీనాక్షి అరోరా కోరారు. దీనిపై తమకు సమాచారం లేదని, జనార్దన్రెడ్డి బళ్లారి వెళితే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అవసరమనుకుంటే పిటిషనర్ ఇంటి ఎదుట అధికారిని ఉంచాలని మీనాక్షి అరోరా చెప్పారు. స్పందించిన న్యాయమూర్తి ‘మాకు మీపై విశ్వాసం ఉంది. అయితే పిటిషనర్ కుమార్తె ప్రసవించిన విషయాన్ని అధికారులు ధ్రువీకరించాలి’ అంటూ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?